షార్జా అగ్నిప్రమాదంలో తండ్రి, కూతురు మృతి
- January 26, 2024
యూఏఈ: షార్జాలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో పాకిస్థాన్ జాతీయుడు, అతని కుమార్తె మరణించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మృతిచెందిన ఇమ్రాన్ ఖాన్ మరియు అతని కుటుంబం షార్జాలో నివసిస్తున్నారని యూఏఈలోని పాకిస్తాన్ రాయబారి ఫైసల్ తిర్మిజీ చెప్పారు. ఖాన్ భార్య, ఇద్దరు పిల్లలు షార్జాలోని అల్ ఖాసిమి హాస్పిటల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నారు. "జనవరి 25న ఉదయం షార్జాలో ఉన్న ఒక పాకిస్తానీ ఇంట్లో దురదృష్టకర ప్రమాదం జరిగింది. ఇందులో కుటుంబ పెద్ద ఇమ్రాన్ ఖాన్, అతని ఒక కుమార్తె ఈ సంఘటనలో మరణించారు. అతని భార్య మరియు ఇద్దరు పిల్లలు అల్ ఖాసిమి హాస్పిటల్ ICUలో చికిత్స పొందుతున్నారు. ”అని రాయబారి తెలిపారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









