మోచేతులు మెరవడానికి చిట్కాలు ..
- May 31, 2016
మోచేతులు మెరిసేలా! ముఖం, మెడ గురించి అందరూ శ్రద్ధ పెడతారు. కానీ మోచేతుల గురించి మాత్రం చాలామంది పట్టించుకోరు. అవి నల్లగా ఉంటే పొట్టి చేతుల దుస్తులు ధరించినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ఆ నలుపు తగ్గించుకునేలా చూసుకోండి. అదెలాగంటే..
చక్కెర: మృతకణాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల చర్మం నల్లగా, బరగ్గా మారుతుంది. ఆ సమస్య నుంచి బయట పడాలంటే చెంచా తేనెలో చక్కెర, కాస్త నిమ్మరసం కలిపి మోచేతులకు రాసుకుని మర్దన చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి, నలుపుదనం కూడా తగ్గుతుంది.
నిమ్మకాయ: నిమ్మరసంలో సహజ బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. నిమ్మకాయను సగానికి కోసి చక్కెరలో అద్ది మోచేతులపై రుద్దాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో కడిగి తేనెతో సున్నితంగా మర్దన చేయాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజింగ్ గుణాలను అందించి నలుపు తగ్గిస్తుంది.
బంగాళాదుంప: ఇందులోనూ బ్లీచింగ్ గుణాలుంటాయి. రెండు బంగాళాదుంపల్ని గుజ్జుగా చేసి అందులో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు పూతలా రాయాలి. కాసేపయ్యాక మర్దన చేసి కడిగేస్తే చర్మం చక్కగా నిగారింపును సంతరించుకుంటుంది.
ఆలివ్నూనె: ఈ నూనెతో మర్దన చేయడం వల్ల బరగ్గా మారిన చర్మం మృదువుగా మారుతుంది. నలుపుదనం కూడా తగ్గుతుంది. ఆలివ్ నూనెను కాస్త వేడి చేసి అందులో బాదం, కొబ్బరినూనెను కొద్దికొద్దిగా కలిపి నల్లగా ఉన్న చోట రాయాలి. ప్రతిరోజూ రాత్రిపూట ఇలా చేయడం వల్ల క్రమంగా చర్మం రంగుమారి మృదువుగా తయారవుతుంది.
చందనం: చర్మ రంగును మార్చి.. చక్కటి నిగారింపును సొంతం చేసుకోవడానికి చందనం దోహదం చేస్తుంది. రెండుచెంచాల గంధంలో కొద్దిగా తేనె కలిపి మోచేతులకు రాయాలి. ఇది మృతకణాలను తొలగిస్తుంది. తేనె తేమనందించి మృదువుగా మారుస్తుంది.
పెరుగు: సెనగపిండీ, పెరుగూ సమపాళ్లలో తీసుకుని పూతలా వేసుకోవాలి. పొడిగా అయ్యాక కాసిని నీళ్లు చల్లి మర్దన చేసుకుని కడిగేయాలి. సెనగపిండి నలుపును తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







