పనీర్ జామూన్
- May 31, 2016
కావలసిన పదార్థాలు : కోవా - 60 గ్రా., పనీర్ 10 గ్రా., మైదా - 10 గ్రా., యాలకుల పొడి - 6 గ్రా., పాలు - 1 లీటరు, పంచదార - 100గ్రా., కుంకుమపువ్వు - 2 గ్రా., పాకానికి - (నీరు 20 మి.లీ. + పంచదార 90 గ్రా), అలంకరణకు తరిగిన పిస్తా , బాదంలతో పాటు కొంత సిల్వర్ లీఫ్.
తయారుచేసే విధానం : ఒక పాత్రలో సన్నగా తరిగిన పనీర్, కోవా, మైదా, యాలకులపొడి వేసి మెత్తగా ముద్దలా కలుపుకోవాలి (అవసరమైతే కొన్ని పాలు కలుపుకోవచ్చు). దీన్ని చిన్న నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకుని నూనెలో దోరగా వేగించి పంచదార పాకంలో (ముందే తయారుచేసి ఉంచుకోవాలి) నానవేయాలి. మరో పాత్రలో పాలను, పంచదారను కలిపి 30 శాతం మిగిలేలా మరిగించుకోవాలి. పాకంలో నానిన ఉండల్ని ఒక పాత్రలోకి తీసుకుని పాల మిశ్రమాన్ని వాటిపైన మునిగేలా పోసి పిస్తా, బాదం, సిల్వర్లీఫ్లతో అలంకరిచి తినాలి.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







