అబుధాబిలో కొత్త హిందూ దేవాలయాన్ని సందర్శించిన 42 దేశాల దౌత్యవేత్తలు
- January 31, 2024
యూఏఈ: 42 దేశాల నుండి రాయబారులు మరియు దౌత్యవేత్తలు BAPS హిందూ మందిర్ను సందర్శించారు. మధ్యప్రాచ్యంలోని మొట్టమొదటి సాంప్రదాయ రాతి దేవాలయం పురోగతిని ప్రత్యక్షంగా తిలకించి ఆశ్యర్యాన్ని వ్యక్తం చేవారు.యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ఆహ్వానం మేరకు వారు ఆలయాన్ని సందర్శించారు.ఆలయం నిర్మాణం తుది దశకు చేరుకుందని ఫిబ్రవరి 14 న మహంత్ స్వామి మహారాజ్, భారత ప్రధాని నరేంద్ర మోదీచే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సుధీర్ తెలిపారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న రాయబారులు మరియు దౌత్యవేత్తలకు పూలమాలలతో స్వాగతం పలికారు. BAPS హిందూ మందిర్ ప్రాజెక్ట్ అధిపతి పూజ్య స్వామి బ్రహ్మవిహారిదాస్ మాట్లాడుతూ.. ఆలయ చారిత్రక ప్రాముఖ్యత, నిర్మాణ ప్రక్రియ మరియు ప్రపంచ ప్రభావాన్ని తెలియజేసారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సహకరించిన యూఏఈ -భారతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయం వ్యక్తులకు ప్రేమ, సామరస్యం మరియు సహనం గురించి బోధించే స్ఫూర్తిదాయకమైన భవనం అని నేపాల్ రాయబారి తేజ్ బహదూర్ ఛెత్రి కొనియాడారు. ఆలయాన్ని సందర్శించిన వారిలో అర్జెంటీనా, అర్మేనియా, బహ్రెయిన్, బంగ్లాదేశ్, బోస్నియా మరియు హెర్జెగోవినా, కెనడా, చాడ్, చిలీ, సైప్రస్, చెక్ రిపబ్లిక్, డొమినికన్ రిపబ్లిక్, ఈజిప్ట్, ఈయూ, ఫిజీ, గాంబియా, జర్మనీ, ఘనా, ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ, మోల్డోవా, మాంటెనెగ్రో, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, నైజీరియా, పనామా, ఫిలిప్పీన్స్, పోలాండ్, సీషెల్స్, సింగపూర్, శ్రీలంక, స్వీడన్, సిరియా, థాయిలాండ్, యూఏఈ, యుకె, యూఎస్, జింబాబ్వే మరియు జాంబియా నుండి వచ్చిన రాయబారులు ఉన్నారు. వీరితోపాటు సీనియర్ దౌత్యవేత్తలు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









