అయోధ్యకు 8 నగరాల నుంచి నాన్స్టాప్ విమాన సేవలు..
- February 01, 2024
అయోధ్య: భారత దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతూ ప్రజాప్రతినిధులు అయోధ్యకు గురువారం విమాన సేవల్ని ప్రారంభించారు. ఇవి అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల నుంచి అయోధ్య కు వచ్చే భక్తులకు ప్రయాస తప్పనుంది.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కలిసి స్పైస్ జెట్ విమాన సేవల్ని ప్రారంభించారు. "దర్బంగా, అహ్మదాబాద్, చెన్నై, జైపుర్, పట్నా, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నుంచి అయోధ్యకు వచ్చే భక్తులకు స్పైస్ జెట్ నాన్ స్టాప్ సేవల్ని అందించనుంది.
"దర్బంగా, అహ్మదాబాద్, చెన్నై, జైపుర్, పట్నా, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నుంచి అయోధ్యకు వచ్చే భక్తులకు స్పైస్ జెట్ నాన్ స్టాప్ సేవల్ని అందించనుంది. దీంతో కనెక్టివిటీ పెరగడంతోపాటు.. అయోధ్యలో పర్యాటక రంగం మరింతగా అభివృద్ధి చెందుతుంది. గతంలో ఈ ప్రాంతం కొన్ని కారణాల వల్ల నిర్లక్ష్యానికి గురైంది. అయోధ్య ధామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం నగర అభివృద్ధిలో కీలక మైలు రాయిగా నిలిచింది. అయోధ్య దేశ విశ్వాసానికి చిహ్నం. ప్రజల మనోభావాలు శ్రీ రామ్ లల్లాతో ముడిపడి ఉన్నాయి. ప్రతి అయోధ్యవాసి నగర అభివృద్ధి కోసం ఆకాంక్షించారు. నేడు ఆ కల సాకారం అవుతోంది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగిన10 రోజుల్లో రామచంద్రుడి దర్శనం కోసం 25 లక్షల మందికిపైగా భక్తులు వచ్చారు" అని యోగీ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







