పి.వాసు వారసుడు 'శివలింగ' చిత్రం లో...
- June 01, 2016
సీనియర్ దర్శకుడు పి.వాసు వారసుడు శక్తి 'చిన్నతంబి' చిత్రంతో బాలనటుడిగా ఇండస్ర్టీకి పరిచయమయ్యాడు. అనేక చిత్రాల్లో బాలనటుడిగా అలరించిన అనంతరం పి.వాసు తెరకెక్కించిన 'తొట్టాల్ పూ మలరుమ్' చిత్రం ద్వారా శక్తిని హీరోగా ఆరంగేట్రం చేశాడు. అయితే హీరోగా శక్తి కెరీర్ ఆశించినట్టుగా సాగలేదు. కొంతకాలం నటనకు దూరంగా వున్నాడు కూడా. ఈ మధ్యే శక్తివేల్ వాసుగా పేరు మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తన తండ్రి దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నాడు శక్తి. కన్నడంలో ఘన విజయం సాధించిన 'శివలింగ' చిత్రాన్ని తమిళంలో లారెన్స్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇందులో రెండో హీరోగా శక్తి నటించనున్నాడు.తన వారసుడ్ని నటుడిగా నిలబెట్టాలన్న లక్ష్యంతోనే ఈ పాత్రకు శక్తిని తీసుకున్నట్లు సమాచారం. కాగా, శక్తి ప్రస్తుతం '7నాట్కల్', 'దుర్యోదన' చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







