పి.వాసు వారసుడు 'శివలింగ' చిత్రం లో...
- June 01, 2016
సీనియర్ దర్శకుడు పి.వాసు వారసుడు శక్తి 'చిన్నతంబి' చిత్రంతో బాలనటుడిగా ఇండస్ర్టీకి పరిచయమయ్యాడు. అనేక చిత్రాల్లో బాలనటుడిగా అలరించిన అనంతరం పి.వాసు తెరకెక్కించిన 'తొట్టాల్ పూ మలరుమ్' చిత్రం ద్వారా శక్తిని హీరోగా ఆరంగేట్రం చేశాడు. అయితే హీరోగా శక్తి కెరీర్ ఆశించినట్టుగా సాగలేదు. కొంతకాలం నటనకు దూరంగా వున్నాడు కూడా. ఈ మధ్యే శక్తివేల్ వాసుగా పేరు మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తన తండ్రి దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నాడు శక్తి. కన్నడంలో ఘన విజయం సాధించిన 'శివలింగ' చిత్రాన్ని తమిళంలో లారెన్స్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇందులో రెండో హీరోగా శక్తి నటించనున్నాడు.తన వారసుడ్ని నటుడిగా నిలబెట్టాలన్న లక్ష్యంతోనే ఈ పాత్రకు శక్తిని తీసుకున్నట్లు సమాచారం. కాగా, శక్తి ప్రస్తుతం '7నాట్కల్', 'దుర్యోదన' చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









