ఏపీ మంత్రివర్గం నిర్ణయం

- June 01, 2016 , by Maagulf
ఏపీ మంత్రివర్గం నిర్ణయం

ఈ నెల 8న ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో మహా సంకల్పం బహిరంగ సభను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ రోజు ఉదయం విజయవాడలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ నెల 20 నుంచి 30 వరకు రాష్ట్రంలో పల్స్‌ సర్వేకు ఆమోదం తెలిపారు. గురువారం నిర్వహించే నవ నిర్మాణ దీక్షలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నెల 10 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను చేపట్టాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. జూన్‌ 27 నాటికి ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి అమరావతికి రావాల్సిందేనని చంద్రబాబు ఆదేశించారు. అమరావతికి వచ్చే ఉద్యోగులకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత సీఆర్డీయే తీసుకోవాలని చంద్రబాబు స్పష్టంచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com