ఏపీ మంత్రివర్గం నిర్ణయం
- June 01, 2016
ఈ నెల 8న ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో మహా సంకల్పం బహిరంగ సభను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ రోజు ఉదయం విజయవాడలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ నెల 20 నుంచి 30 వరకు రాష్ట్రంలో పల్స్ సర్వేకు ఆమోదం తెలిపారు. గురువారం నిర్వహించే నవ నిర్మాణ దీక్షలో జిల్లా ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నెల 10 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను చేపట్టాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. జూన్ 27 నాటికి ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి రావాల్సిందేనని చంద్రబాబు ఆదేశించారు. అమరావతికి వచ్చే ఉద్యోగులకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత సీఆర్డీయే తీసుకోవాలని చంద్రబాబు స్పష్టంచేశారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







