రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- February 08, 2024
న్యూ ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి ఎంత మంది ఓటేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
రాజ్యసభ ఎన్నికల ముందు ఏపీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు విచారణకు వచ్చిన విషయం తెలిసిందే. అనర్హత పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. నేడే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు స్పీకర్ తమ్మినేని.
ఏప్రిల్లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రబాబు, సీఎం రమేశ్ బాబు పదవీ కాలం కూడా ముగియనుంది. ఏప్రిల్ 2వ తేదీన వీరు ముగ్గురు పదవీ విరమణ చేస్తారు. వైసీపీ ఇవాలఏ ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
తాజా వార్తలు
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి









