రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- February 08, 2024
న్యూ ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి ఎంత మంది ఓటేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
రాజ్యసభ ఎన్నికల ముందు ఏపీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు విచారణకు వచ్చిన విషయం తెలిసిందే. అనర్హత పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. నేడే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు స్పీకర్ తమ్మినేని.
ఏప్రిల్లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రబాబు, సీఎం రమేశ్ బాబు పదవీ కాలం కూడా ముగియనుంది. ఏప్రిల్ 2వ తేదీన వీరు ముగ్గురు పదవీ విరమణ చేస్తారు. వైసీపీ ఇవాలఏ ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







