రోజ్ వాటర్తో అందం రెట్టింపు చేసుకోండిలా.!
- February 12, 2024![11 రోజ్ వాటర్తో అందం రెట్టింపు చేసుకోండిలా.!](https://www.maagulf.com/godata/articles/202402/RW_1707759255.jpg)
శరీర భాగాలన్నింట్లోనూ అందం పరంగా ముఖానికి ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది. అందుకే యువత.. కాదు కాదు ఎవరైనా సరే, ముఖ సౌందర్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు.
ముఖ సౌందర్యానికి అనేక రకాల సౌందర్య లేపనాలు వాడుతుంటారు. మార్కెట్లో లభించే కొన్ని రకాల సౌందర్య లేపనాలూ ముఖానికి హాని చేసే ప్రమాదముంది.
కానీ, రోజ్ వాటర్ మాత్రం ముఖం ఆరోగ్యాన్ని రెట్టింపు చేయడంతో పాటూ, అందాన్ని సైతం పెంచుతుంది. కాంతివంతంగా మెరిసిపోయేలా చేస్తుంది.
దీనిలో కెమికల్స్ తక్కువగా వుండి, సహజసిద్ధమైన న్యూట్రియెంట్స్ వుంటాయ్. అందుకే ముఖానికి ఎటువంటి హానీ చేయవు. ఎండలో తిరిగి ఎప్పుడైనా అలసిపోయినట్లుగా అనిపిస్తే.. రోజ్ వాటర్లో ముంచిన దూదితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే వాడిపోయినట్లుగా వున్న ముఖం కాంతివంతంగా మారుతుంది.
అలాగే, రోజ్ వాటర్లో ముల్తానీ మట్టి కలిపి ముకానికి ప్యాక్లా వేసుకుంటే.. ఉష్ణ తాపం వల్ల నల్లగా మారిన ముఖ చర్మం తెల్లగా మారుతుంది. కొత్త కళను సంతరించుకుంటుంది.
అలోవెరా జెల్, రోజ్ వాటర్లో మిక్స్ చేసి ముఖానికి పట్టించి పది నిముషాల తర్వాత కడిగేస్తే ముఖంపై వచ్చిన మొటిమలు తొలిగిపోతాయ్. అలాగే, మొటిమల కారణంగా వచ్చే వాపు, నొప్పి కూడా తగ్గుతుంది.
తాజా వార్తలు
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..