రోజ్ వాటర్తో అందం రెట్టింపు చేసుకోండిలా.!
- February 12, 2024శరీర భాగాలన్నింట్లోనూ అందం పరంగా ముఖానికి ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది. అందుకే యువత.. కాదు కాదు ఎవరైనా సరే, ముఖ సౌందర్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు.
ముఖ సౌందర్యానికి అనేక రకాల సౌందర్య లేపనాలు వాడుతుంటారు. మార్కెట్లో లభించే కొన్ని రకాల సౌందర్య లేపనాలూ ముఖానికి హాని చేసే ప్రమాదముంది.
కానీ, రోజ్ వాటర్ మాత్రం ముఖం ఆరోగ్యాన్ని రెట్టింపు చేయడంతో పాటూ, అందాన్ని సైతం పెంచుతుంది. కాంతివంతంగా మెరిసిపోయేలా చేస్తుంది.
దీనిలో కెమికల్స్ తక్కువగా వుండి, సహజసిద్ధమైన న్యూట్రియెంట్స్ వుంటాయ్. అందుకే ముఖానికి ఎటువంటి హానీ చేయవు. ఎండలో తిరిగి ఎప్పుడైనా అలసిపోయినట్లుగా అనిపిస్తే.. రోజ్ వాటర్లో ముంచిన దూదితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే వాడిపోయినట్లుగా వున్న ముఖం కాంతివంతంగా మారుతుంది.
అలాగే, రోజ్ వాటర్లో ముల్తానీ మట్టి కలిపి ముకానికి ప్యాక్లా వేసుకుంటే.. ఉష్ణ తాపం వల్ల నల్లగా మారిన ముఖ చర్మం తెల్లగా మారుతుంది. కొత్త కళను సంతరించుకుంటుంది.
అలోవెరా జెల్, రోజ్ వాటర్లో మిక్స్ చేసి ముఖానికి పట్టించి పది నిముషాల తర్వాత కడిగేస్తే ముఖంపై వచ్చిన మొటిమలు తొలిగిపోతాయ్. అలాగే, మొటిమల కారణంగా వచ్చే వాపు, నొప్పి కూడా తగ్గుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్