గాజా పరిస్థితి పై చర్చించిన ఖతార్, ఇరాన్

- February 13, 2024 , by Maagulf
గాజా పరిస్థితి పై చర్చించిన ఖతార్, ఇరాన్

దోహా: దోహా పర్యటనలో ఉన్న ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్‌ఈ హొస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్‌తో ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గాజా స్ట్రిప్ మరియు ఆక్రమిత పాలస్తీనా భూభాగాలలో తాజా పరిణామాలతో పాటు ఈ ప్రాంతంలో విస్తరిస్తున్న హింసాకాండ, ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. ఇదే సమయంలో ద్వైపాక్షిక సహకార సంబంధాలు, వాటిని మెరుగుపరచడానికి మరియు అభివృద్ధి చేయడానికి మార్గాలపై సమీక్షించారు. గాజా స్ట్రిప్‌లో తక్షణ కాల్పుల విరమణ, పౌరుల రక్షణ మరియు స్ట్రిప్‌లోకి నిరంతరాయంగా మానవతా సహాయం అందించాలని ఈ సందర్భంగా ఇరుదేశాల నేతలు డిమాండ్ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com