జెడ్డాలో పలువురు విదేశీ కార్మికులు అరెస్ట్

- February 13, 2024 , by Maagulf
జెడ్డాలో పలువురు విదేశీ కార్మికులు అరెస్ట్

జెడ్డా: నేషనల్ ప్రోగ్రామ్ టు కంబాట్ కమర్షియల్ కన్సీల్‌మెంట్ (తసత్తూరు)కి చెందిన తనిఖీ బృందాలు జెడ్డా గవర్నరేట్‌లోని ప్రధాన కూరగాయల మార్కెట్ మరియు ఇతర పబ్లిక్ యుటిలిటీ మార్కెట్‌లపై దాడులు చేశాయి. ఈ సందర్భంగా చట్టాలను ఉల్లంఘించిన పలువురిని అదుపులోకి తీసుకున్నాయి. అదే సమయంలో ఉల్లంఘనలకు పాల్పడిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.  కూరగాయలు మరియు పండ్ల రంగంలో సౌదైజేషన్ నిబంధనలను ఉల్లంఘించిన 15 సంస్థలపై కేసులు నమోదు చేశారు.  యాంటీ-కమర్షియల్ కన్సీల్‌మెంట్ చట్టం ప్రకారం.. నేరాలకు పాల్పడిన వారిపై ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR 5 మిలియన్ వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com