తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు
- February 14, 2024
దోహా: ఖతార్ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రీయ క్రీడ అయిన కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఇట్టి పోటీల్లో ఖతర్లో నివసిస్తున్న వందకు పైగా తెలుగు కార్మికులు పాల్గొనగా చివరకు జనసేన వారియర్స్ మరియు విజేత వారియర్స్ జట్లు ఫైనల్లో పోటాపోటీగా తలపడగా విజేత వారియర్స్ జట్టు ఛాంపియన్ గా గెలిచింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎ.సి.బి.ఎఫ్ తెలుగు రాష్ట్రాల రిప్రజెంటివ్ సుందరగిరి శంకర్ గౌడ్ విచ్చేశారు శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ స్పోర్ట్స్ డే సందర్భంగా మన రాష్ట్ర క్రీడను నేటి యువతకు ప్రోత్సహిస్తున్నందుకు అభినందించారు.
అనంతరం తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షులు మైదం మధు మాట్లాడుతూ గల్ఫ్ సమితి సేవా కార్యక్రమాలు కాకుండా సాంస్కృతిక క్రీడ కార్యక్రమంలో కూడా ముందుంటుందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి ఉపాధ్యక్షులు గడ్డి రాజు ప్రధాన కార్యదర్శి సహగిరి వంశి మెంబర్షిప్ సెక్రటరీ గోలి శ్రీనివాస్ ఇన్సూరెన్స్ సెక్రటరీ సాగర్ వెల్ఫేర్ సెక్రెటరీ మనోహర్ చెవుల మధ్య మీడియా మరియు పిఆర్ఓ సెక్రెటరీ సంజీవ్ మరియు అడ్వైజర్ మెంబర్స్ తాళ్లపల్లి ఎల్లయ్య వేములవాడ ఎల్లన్న పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్







