విషాదం..ఫిబ్రవరి 16న నిశ్చితార్థం.. ఒమన్లో భారత యువకుడు మృతి
- February 15, 2024
మస్కట్: భారతదేశంలోని తన నిశ్చితార్థ వేడుకకు కొద్ది రోజుల ముందు ఒమన్లో భారీ వర్షాలలో భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అతని అకాల మరణ వార్త అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. 28 ఏళ్ల అబ్దుల్లా వాహిద్ ఒక ప్రైవేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. సూర్ నుండి మస్కట్కు తిరిగి వస్తుండగా అతను సోమవారం ఇబ్రాలోని వాడిని దాటుతుండగా వరద ధాటికి కొట్టుకుపోయాడు. అతని సహోద్యోగి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనపై మస్కట్లోని కేరళ ముస్లిం కల్చర్ సెంటర్ (KMCC) ప్రతినిధి మహ్మద్ వానిమెల్ విచారం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 16న వాహిద్ నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, కేరళలోని అలెప్పీ జిల్లాలో అతని కుటుంబం వేడుకల కోసం ఏర్పాట్లు కూడా చేసిందన్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









