ఇద్దరు వృద్ధులను రక్షించిన పోలీసులు
- February 15, 2024
యూఏఈ: హట్టాలో వరదలో కొట్టుకుపోయిన వాహనాల నుండి ఇద్దరు వృద్ధులను దుబాయ్ పోలీసుల బృందాలు సురక్షితంగా రక్షించాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కష్టతరమైన ఆపరేషన్లో పోర్ట్స్ పోలీస్ స్టేషన్లోని మెరైన్ రెస్క్యూ విభాగానికి చెందిన బృందాలు, హట్టా పోలీస్ స్టేషన్లోని ల్యాండ్ రెస్క్యూ టీమ్స్ లోయలో చిక్కుకున్న ఐదు వాహనాలను బయటకు తీసాయి. రెస్క్యూ టీమ్లు వెంటనే జోక్యం చేసుకుని వాహనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు హట్టా సెక్టార్ కమాండర్ బ్రిగేడియర్ డాక్టర్ హసన్ సుహైల్ అల్ సువైదీ తెలిపారు. ప్రయాణికుల్లో 60 ఏళ్లు పైబడిన ఇద్దరు వృద్ధులు ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా జారీ చేయబడిన హెచ్చరికలను పాటించాలని వాహనదారులను అథారిటీ కోరింది. నివాసితులు లోయలు మరియు పర్వత ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







