ఇద్దరు వృద్ధులను రక్షించిన పోలీసులు
- February 15, 2024
యూఏఈ: హట్టాలో వరదలో కొట్టుకుపోయిన వాహనాల నుండి ఇద్దరు వృద్ధులను దుబాయ్ పోలీసుల బృందాలు సురక్షితంగా రక్షించాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కష్టతరమైన ఆపరేషన్లో పోర్ట్స్ పోలీస్ స్టేషన్లోని మెరైన్ రెస్క్యూ విభాగానికి చెందిన బృందాలు, హట్టా పోలీస్ స్టేషన్లోని ల్యాండ్ రెస్క్యూ టీమ్స్ లోయలో చిక్కుకున్న ఐదు వాహనాలను బయటకు తీసాయి. రెస్క్యూ టీమ్లు వెంటనే జోక్యం చేసుకుని వాహనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు హట్టా సెక్టార్ కమాండర్ బ్రిగేడియర్ డాక్టర్ హసన్ సుహైల్ అల్ సువైదీ తెలిపారు. ప్రయాణికుల్లో 60 ఏళ్లు పైబడిన ఇద్దరు వృద్ధులు ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా జారీ చేయబడిన హెచ్చరికలను పాటించాలని వాహనదారులను అథారిటీ కోరింది. నివాసితులు లోయలు మరియు పర్వత ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!









