ఈ-కేవైసీ పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
- February 16, 2024అమరావతి: ఏపీ రైతులకు జగన్ సర్కార్ ఈ-కేవైసీపై కీలక ప్రకటన చేసింది . ప్రస్తుత రబీ సీజన్ లో ఈ-క్రాప్, ఈ-కేవైసీ నమోదు ప్రక్రియను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ రైతులను ఆదేశించింది. రబీలో సాగయ్యే శనగ, మొక్కజొన్న, మినుము పంటలు కోతకు వచ్చే సమయం దగ్గర పడుతుందని తెలిపారు అధికారులు. త్వరగా ఈ-క్రాప్, ఈ-కేవైసీల నమోదును పూర్తి చేయాలంది. అటు పీఎం కిసాన్ 16వ విడత నిధులు త్వరలో విడుదల కానుండటంతో ఇంకా ఆధార్ తో బ్యాంకు అకౌంట్లు లింక్ చేయనివారు వెంటనే ఆ ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపింది. కాగా కాకినాడ జిల్లా అన్నవరం రైల్వే స్టేషన్ కు అరుదైన గుర్తింపు దక్కింది. FSSAI నుంచి ఈట్ రైట్ స్టేషన్ అవార్డును సొంతం చేసుకుంది. విజయవాడ డివిజన్ లో ఈ హోదా పొందిన తొలి స్టేషన్ ఇదే కాగా….జోన్ లో నాంపల్లి తర్వాత రెండవ స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్