ముంబై-దోహా.. ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ కార్యకలాపాలు స్టార్ట్..
- February 16, 2024
దోహా: దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ మార్చి 28 నుంచి అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ముంబై నుంచి దోహాకు వారానికి నాలుగు నాన్స్టాప్ విమానాలను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఖాతర్-ఇండియా మధ్య ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుందని ఆకాశ ఎయిర్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం టికెట్లను ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ http://www.akasaair.com, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్లలో టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఆకాశ ఎయిర్ ప్రారంభమైన 19 నెలల కాలంలోనే వేగంగా అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించడం విశేషం. ఈ ఎయిర్లైన్ ప్రస్తుతం 4 శాతం మార్కెట్ను సాధించగా, ఇండిగో 60 శాతం, టాటా గ్రూప్ ఎయిర్లైన్స్ సమిష్టిగా 26 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. దోహా నగరం ఖతార్ రాజధాని. ఇది మధ్యప్రాచ్య ప్రాంతంలోని కీలకమైన వాణిజ్య నగరం. సాంస్కృతిక వారసత్వానికి కూడా ప్రసిద్ధి చెందింది.
ఆకాశ ఎయిర్ CEO వినయ్ దూబే మాట్లాడుతూ, దోహాకు అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రకటించడం సంతోషంగా ఉంది. కీలకమైన భారతీయ వాణిజ్య కేంద్రమైన ముంబైతో నేరుగా దోహాను కనెక్ట్ చేయడం ద్వారా పర్యాటకం, వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం అవుతాయి. రెండు దేశాల మధ్య ప్రయాణించే వారికి ప్రయాణం సులభం అవుతుందని అన్నారు.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









