రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖులకు అవార్డులు..
- June 02, 2016
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పలువురు ప్రముఖులకు ప్రకటించిన అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలకు రూ.లక్షా 116 నగదు పురస్కారంతోపాటు శాలువా, సర్టిఫికెట్, మొమెంటోతో సత్కరించారు. కాగా, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మొత్తం 29 విభాగాల నుంచి 62 మంది ప్రముఖులను ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. అవార్డులకు ఎంపికైన వారిలో సాహిత్యం-7, నృత్యం-2, జానపద నృత్యం-1, సంగీతం-2, జానపద సంగీతం-5, ఉద్యమగానం-3, పెయింటింగ్-1, వేద పండితులు-1, అర్చకులు-2, ఆధ్యాత్మికం-1, సైంటిస్టులు-3, జర్నలిస్టులు-6, హస్త కళలు-6, క్రీడలు-2, ఉద్యోగులు-9, వైద్యులు-1, ఎన్జీవో-1, సోషల్ వర్క్-1, రైతులు-3, అంగన్వాడీ వర్కర్స్-1, ఉత్తమ మున్సిపాలిటీగా ఖమ్మం, ఉత్తమ గ్రామ పంచాయతీలు-3, న్యాయవాదులు-1, ఔత్సాహికులు-1, టీచర్లు-2, ఆధునిక రైతు-1, మాజీ సైనికులు-2, ధైర్యసాహసాలు-1 ఉన్నారు
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







