తేజు ‘గాంజా శంకర్’‌.! అసలేం జరుగుతోందట.!

- February 19, 2024 , by Maagulf
తేజు ‘గాంజా శంకర్’‌.! అసలేం జరుగుతోందట.!

‘విరూపాక్ష’ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘గాంజా శంకర్’. ఊర మాస్ క్యారెక్టర్‌లో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నాడు ఈ సినిమాలో.
మాస్ డైరెక్టర్‌గా పేరున్న సంపత్ నంది ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే, బడ్జెట్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం జరిగింది.
కానీ, తాజాగా తెలంగాణా నార్కోటిక్స్ బ్యూరో నుంచి ‘గాంజా శంకర్’ నిర్మాతలకు నోటీసులు అందాయని సమాచారం. ఈ సినిమాలోని కంటెంట్ యూత్‌ని పాడు చేసే విధంగా వుందంటూ.. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడం మంచిది కాదనీ, వెంటనే ఆపేయాలని నోటీసులిచ్చారట.
అయితే, ఈ విషయమై ఇంకా ‘గాంజా శంకర్’ టీమ్ స్పందించలేదు. ఆ మాటకొస్తే.. అంతకు ముందు జరిగిన సినిమా ఆగిపోయిందన్న ప్రచారంలోనూ టీమ్ ఎటువంటి స్పందనా ఇవ్వలేదు.
అసలు ‘గాంజా శంకర్’ విషయంలో ఏం జరుగుతోంది. అసలే ‘విరూపాక్ష’తో హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం కావడంతో.. తేజు ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది.
ఈ ప్రచారాలపై అడ్డుకట్ట వేసేలా టీమ్ స్పందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి. ఏం జరుగుతుందో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com