తేజు ‘గాంజా శంకర్’.! అసలేం జరుగుతోందట.!
- February 19, 2024
‘విరూపాక్ష’ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘గాంజా శంకర్’. ఊర మాస్ క్యారెక్టర్లో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నాడు ఈ సినిమాలో.
మాస్ డైరెక్టర్గా పేరున్న సంపత్ నంది ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే, బడ్జెట్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం జరిగింది.
కానీ, తాజాగా తెలంగాణా నార్కోటిక్స్ బ్యూరో నుంచి ‘గాంజా శంకర్’ నిర్మాతలకు నోటీసులు అందాయని సమాచారం. ఈ సినిమాలోని కంటెంట్ యూత్ని పాడు చేసే విధంగా వుందంటూ.. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడం మంచిది కాదనీ, వెంటనే ఆపేయాలని నోటీసులిచ్చారట.
అయితే, ఈ విషయమై ఇంకా ‘గాంజా శంకర్’ టీమ్ స్పందించలేదు. ఆ మాటకొస్తే.. అంతకు ముందు జరిగిన సినిమా ఆగిపోయిందన్న ప్రచారంలోనూ టీమ్ ఎటువంటి స్పందనా ఇవ్వలేదు.
అసలు ‘గాంజా శంకర్’ విషయంలో ఏం జరుగుతోంది. అసలే ‘విరూపాక్ష’తో హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం కావడంతో.. తేజు ఫ్యాన్స్లో ఆందోళన నెలకొంది.
ఈ ప్రచారాలపై అడ్డుకట్ట వేసేలా టీమ్ స్పందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి. ఏం జరుగుతుందో.!
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







