జెట్ ఎయిర్వేస్ విమాన ప్రయాణికులకు శుభవార్త..
- June 02, 2016
లీన్ సీజన్ నేపథ్యంలో విమానసంస్థల్లో ధరల యుద్ధం ఊపందుకుంది. వరుసగా ప్రయాణికులకు ఆకట్టుకునేందుకు అడ్వాన్స్ బుకింగ్ లపై రేట్లను తగ్గిసూ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ విమాన ప్రయాణికులకు శుభవార్త అందించింది. గతంలో సెవెన్ డేస్ సేల్ ప్రకటించిన జెట్ తాజాగా 'ఫైవ్ డే సేల్' స్కీమ్ను ప్రకటించింది. రాబోయే వర్షాకాల సీజన్ను దృష్టిలోపెట్టుకుని స్పెషల్ తగ్గింపు ధరల్లో అందిస్తున్నట్టు తెలిపింది. తమ టికెట్ ధరల్లో 20 శాతం స్పెషల్ డిస్కౌంట్ ను ప్రకటించింది. బిజినెస్ , ఎకానమీ రెండు క్లాసుల్లో పరిమిత కాలానికి డొమెస్టిక్ మార్కెట్ కు ఇది వర్తిస్తుందని ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది.జూన్ 2 వ తేదీ 6 వరకు ఈ బుకింగ్స్ చేసుకున్నవారికి ఈ డిస్కౌంట్ వర్తించనుంది. ఇలా బుక్ చేసిన టికెట్లతో జూన్ 25 నుంచి సెప్టెంబర్30 లోపు వినియోగించుకోవాలని తెలిపింది. ఈ ఫైవ్ డే సేల్' ఈ నెల 2-9 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా దేశీయ విమాన టికెట్ ధరల్లో దాదాపు 20 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఎకానమీ,బిజినెస్ తరగతుల ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. జులై, జనవరి సీజన్లను లో సీజన్ గా విమానయాన సంస్థలు పరిగణిస్తాయి. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణీకులను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటించడం మామూలే. ఈ కోవలోనే ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఆసియా ఇప్పటికే ఈ ఆఫర్లను ప్రకటించింన సంగతి తెలిసిందే
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







