రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ ఈ సారైనా ఫలిస్తుందా.?
- February 20, 2024వివాదాలతో సావాసం చేసే రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. అందుకు కారణం ఆయన తెరకెక్కించిన రెండు సినిమాలూ బ్యాక్ టు బ్యాక్ వన్ వీక్ గ్యాప్లో రిలీజ్ చేస్తుండడమే. ఈ వారం ఆయన తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా రిలీజ్కి సిద్ధమైంది.
ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర, జైలు ప్రయాణం, బెయిల్పై బయటికి రావడం.. గట్రా పలు అంశాల్ని చూపించబోతున్నారు. ఈ వారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జగన్ పాత్రలో అజ్మల్ నటిస్తుండగా.. ఆయన భార్య భారతి పాత్రలో మానస నటిస్తోంది. ఎప్పుడో రిలీజ్ కావల్సిన ఈ సినిమా పలు వివాదాల కారణంగా వాయిదా పడుతూ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
అలాగే మరో సినిమా ‘శపథం’ కూడా వచ్చే వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదేంటో.! ఆయన ఎప్పుడు సినిమాలు తెరకెక్కించేస్తాడో.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో.! అసలు కొన్ని సినిమాలైతే రిలీజ్కే నోచుకోవు.
కానీ, ఈ సారి మాత్రం రెండు సినిమాల్నీ వారం రోజుల గ్యాప్లో రిలీజ్ చేసేస్తున్నాడు. సినిమాల్లో విషయం పక్కన పెడితే.. రిలీజ్కి ముందు ఆయన చేసే పబ్లిసిటీ స్టంట్లే సినిమాలపై ఆసక్తిని రేకెత్తిస్తాయంతే.! అలాంటివే ఇప్పుడు రాబోయే రెండు సినిమాలూ కూడా. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్ని ఆడిపోసుకోవడమే ఆయన సినిమాల్లోని వుద్దేశ్యం.
తాజా వార్తలు
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు