‘గీతాంజలి మళ్లీ వచ్చింది..’ వావ్.! వాట్ ఏ క్రియేటివిటీ.!

- February 23, 2024 , by Maagulf
‘గీతాంజలి మళ్లీ వచ్చింది..’ వావ్.! వాట్ ఏ క్రియేటివిటీ.!

2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమా మంచి విజయం అందుకుంది. హారర్ కామెడీ చిత్రంగా ప్రేక్షకాదరణ పొందింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబట్టింది ఈ సినిమా.
శ్రీనివాస్ రెడ్డి, అంజలి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాకి తాజాగా సీక్వెల్ రూపొందించారు. అదే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. అంజలి డబుల్ రోల్ పోషించిన ‘గీతాంజలి’ సినిమాలో నటించిన ప్రధాన పాత్రధారులంతా ఈ సీక్వెల్‌లోనూ కనిపించబోతున్నారు.
అయితే, ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సినిమా టీజర్‌ని శ్మశానంలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైద్రాబాద్‌లోని బేగంపేట్ శ్మశాన వాటికలో టీజర్ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు. ఈ నెల 24 శనివారం రాత్రి 7 గంటలకు శ్మశాన వాటికలో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.
ఎంత హారర్ మూవీ అయితే మాత్రం మరీ ఇంతలా ప్రమోషన్లు ప్లాన్ చేస్తారా.? అని అవాక్కవుతున్నారంతా. అంతేకాదు, ‘ఆది పురుష్’ సినిమాకి ధియేటర్లలో హనుమంతుడి కోసం ఓ సీటు వదిలిపెట్టినట్లు.. ఈ సినిమా రిలీజ్ చేసే ధియేటర్లలో కూడా ఓ సీటు దెయ్యం కోసం వదిలిపెడతారేమో.. అనుకుంటూ కామెంట్లు కూడా వేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com