‘గీతాంజలి మళ్లీ వచ్చింది..’ వావ్.! వాట్ ఏ క్రియేటివిటీ.!
- February 23, 2024
2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమా మంచి విజయం అందుకుంది. హారర్ కామెడీ చిత్రంగా ప్రేక్షకాదరణ పొందింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబట్టింది ఈ సినిమా.
శ్రీనివాస్ రెడ్డి, అంజలి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాకి తాజాగా సీక్వెల్ రూపొందించారు. అదే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. అంజలి డబుల్ రోల్ పోషించిన ‘గీతాంజలి’ సినిమాలో నటించిన ప్రధాన పాత్రధారులంతా ఈ సీక్వెల్లోనూ కనిపించబోతున్నారు.
అయితే, ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సినిమా టీజర్ని శ్మశానంలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైద్రాబాద్లోని బేగంపేట్ శ్మశాన వాటికలో టీజర్ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు. ఈ నెల 24 శనివారం రాత్రి 7 గంటలకు శ్మశాన వాటికలో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.
ఎంత హారర్ మూవీ అయితే మాత్రం మరీ ఇంతలా ప్రమోషన్లు ప్లాన్ చేస్తారా.? అని అవాక్కవుతున్నారంతా. అంతేకాదు, ‘ఆది పురుష్’ సినిమాకి ధియేటర్లలో హనుమంతుడి కోసం ఓ సీటు వదిలిపెట్టినట్లు.. ఈ సినిమా రిలీజ్ చేసే ధియేటర్లలో కూడా ఓ సీటు దెయ్యం కోసం వదిలిపెడతారేమో.. అనుకుంటూ కామెంట్లు కూడా వేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









