‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించిన ప్రధాని
- February 25, 2024
గుజరాత్: గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించారు. దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జిగా ఇది నిలిచింది. 4 లేన్ల రహదారి కలిగిన ఈ వంతెన 2.32 కిలోమీటర్ల పొడవు ఉంది. దీని నిర్మాణానికి రూ.979 కోట్లు ఖర్చయ్యాయి. ఈ వంతెన ఓఖా ప్రాంతంతో ద్వారక ద్వీపాన్ని అనుసంధానం చేస్తుంది. త్వరలోనే ఈ బ్రిడ్జిపై పూర్తి స్థాయిలో రాకపోకలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ వంతెనకు ఇరువైపులా భగవద్గీతలోని శ్లోకాలు, శ్రీకృష్ణుని చిత్రాలతో అలంకరించబడిన నడక మార్గం ఉంది. ఈ వంతెనను ప్రారంభించిన తరవాత ప్రధాని మోదీ ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తరవాత గుజరాత్లోని రాజ్కోట్లో తొలి AIIMS హాస్పిటల్ని ప్రారంభిస్తారు. కేబుల్ బ్రిడ్జ్ని ప్రారంభించడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని వెల్లడించారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









