ఫిబ్రవరి 27 నుండి యూఏఈ-ఒమన్ బస్సు సర్వీస్ ప్రారంభం
- February 25, 2024
యూఏఈ: యూఏఈ-ఒమన్ మధ్య కొత్త బస్సు సర్వీస్ షార్జా మరియు మస్కట్లను కలుపుతుందని ప్రజా రవాణా సంస్థ మ్వాసలత్ ప్రకటించింది. ఫిబ్రవరి 27 నుండి రోజువారీ సేవలు ప్రారంభం కానున్నాయి. షార్జా మరియు మస్కట్ నుండి నాలుగు ట్రిప్పులు ఉంటాయి. ఈ సర్వీస్ షినాస్ ద్వారా పనిచేస్తుంది. ప్రయాణీకులు 23 కిలోలను చెక్-ఇన్ బ్యాగేజీగా తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. 7 కిలోలు హ్యాండ్ బ్యాగేజీగా తీసుకెళ్లవచ్చు. ఛార్జీలు 10 ఒమన్ రియాల్స్ (Dh95.40) మరియు 29 ఒమన్ రియాల్స్ (Dh276.66) నుండి ప్రారంభమవుతాయి. షార్జా నుండి మొదటి బస్సు అల్ జుబైల్ బస్ స్టేషన్ నుండి ఉదయం 6.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు అజైబా బస్ స్టేషన్ చేరుకుంటుంది. రెండో బస్సు షార్జా నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి రాత్రి 11.50 గంటలకు మస్కట్ చేరుకుంటుంది. ఇదిలా ఉండగా, మస్కట్ నుండి మొదటి బస్సు ఉదయం 6.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3.40 గంటలకు షార్జా చేరుకుంటుంది. రెండోది మస్కట్లో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 1.10 గంటలకు అల్ జుబైల్ బస్ స్టేషన్ చేరుకుంటుంది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









