లెజండరీ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూత
- February 26, 2024
ముంబై: పద్మశ్రీ అవార్డు గ్రహీత లెజండరీ సింగర్ పంకజ్ ఉదాస్ (72) సోమవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా పంకజ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముంబైలోని బ్రిచ్ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాగా, పంకజ్ ‘నామ్’, ‘సాజన్’, ‘మొహ్రా’ వంటి సినిమాల నేపథ్య గాయకుడిగా సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక 1986లో విడుదలైన నామ్ సినిమాలో ‘చిట్టి ఆయూ హై చిట్టీ ఆయుహై’ పాట ఆయనకు ప్లేబ్యాక్ సింగర్గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. పంకజ్ సోదరులు కూడా గాయకులు. పంకజ్ అన్నయ్య మన్హర్ ఉదాస్ ప్లేబ్యాక్ సింగర్గా రాణించారు. రెండో అన్న నిర్మల్ గజల్ గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తన సోదరుల బాటలోనే పంకజ్ కూడా ప్లేబ్యాక్ సింగర్గా బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







