లెజండరీ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూత
- February 26, 2024
ముంబై: పద్మశ్రీ అవార్డు గ్రహీత లెజండరీ సింగర్ పంకజ్ ఉదాస్ (72) సోమవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా పంకజ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముంబైలోని బ్రిచ్ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాగా, పంకజ్ ‘నామ్’, ‘సాజన్’, ‘మొహ్రా’ వంటి సినిమాల నేపథ్య గాయకుడిగా సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక 1986లో విడుదలైన నామ్ సినిమాలో ‘చిట్టి ఆయూ హై చిట్టీ ఆయుహై’ పాట ఆయనకు ప్లేబ్యాక్ సింగర్గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. పంకజ్ సోదరులు కూడా గాయకులు. పంకజ్ అన్నయ్య మన్హర్ ఉదాస్ ప్లేబ్యాక్ సింగర్గా రాణించారు. రెండో అన్న నిర్మల్ గజల్ గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తన సోదరుల బాటలోనే పంకజ్ కూడా ప్లేబ్యాక్ సింగర్గా బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









