లెజండరీ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూత
- February 26, 2024
ముంబై: పద్మశ్రీ అవార్డు గ్రహీత లెజండరీ సింగర్ పంకజ్ ఉదాస్ (72) సోమవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా పంకజ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముంబైలోని బ్రిచ్ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాగా, పంకజ్ ‘నామ్’, ‘సాజన్’, ‘మొహ్రా’ వంటి సినిమాల నేపథ్య గాయకుడిగా సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక 1986లో విడుదలైన నామ్ సినిమాలో ‘చిట్టి ఆయూ హై చిట్టీ ఆయుహై’ పాట ఆయనకు ప్లేబ్యాక్ సింగర్గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. పంకజ్ సోదరులు కూడా గాయకులు. పంకజ్ అన్నయ్య మన్హర్ ఉదాస్ ప్లేబ్యాక్ సింగర్గా రాణించారు. రెండో అన్న నిర్మల్ గజల్ గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తన సోదరుల బాటలోనే పంకజ్ కూడా ప్లేబ్యాక్ సింగర్గా బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







