ముంబాయ్ లో నాగఅన్వేష్ 'ఏంజిల్' పాటల రికార్డింగ్
- June 02, 2016
నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కనున్న చిత్రం 'ఏంజిల్'. శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై సింధురపువ్వు కృష్ణారెడ్డి నిర్మాతగా బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి యంగ్ టాలెండ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవలే మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'బెంగాల్ టైగర్' కు భీమ్స్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఇక యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న 'ఏంజిల్'కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు భీమ్స్. తాజాగా ముంబాయ్ లో ప్రముఖ ఆడియో రికార్డింగ్ థియేటర్ లో 'ఏంజిల్' పాటల రికార్డింగ్ మొదలైంది. సంగీత దర్శకుడు భీమ్స్ ఆధ్వర్యంలో టాప్ సింగర్స్ విజయ్ ప్రకాష్, శ్రేయ గోషాల్ అలానే అల్లు అర్జున్ సరైనోడు లో బ్లాక్ బస్టర్ పాట పాడిన నకాష్ అజీజ్ తదితరలు 'ఏంజిల్' కు పాటలు పాడబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఒకవైపు పాటల రికార్డింగ్ ఊపందుకుంటే మరో వైపున ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. కథ చాలా అద్భుతంగా వచ్చిందని త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నామని దర్శకనిర్మాతలు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









