ఎంత మంది చార్మినార్ తిలకిస్తున్నారో తెలుసుకోవడానికే ఈ ఈ-టిక్కెట్
- June 02, 2016
చారిత్రక చార్మినార్ కట్టడం సందర్శకులకు బుధవారం నుంచి ఈ-టికెట్లు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ సర్కిల్ పురాతత్వ సర్వేక్షణ విభాగం సూపరింటెండెంట్ ఎన్.తహర్ ఈ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-టికెట్ విధానంలో పారదర్శకత ఉంటుందన్నారు. భారతీయ సందర్శకులకు రూ.15, విదేశీయులకు రూ.200 ప్రవేశ రుసుముగా వసూలు చేస్తున్నామన్నారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని, అయినా వీరికి సైతం ఉచిత ఈ-ప్రవేశ టికెట్ జారీ చేస్తున్నామన్నారు. ఎంత మంది పిల్లలు చార్మినార్ తిలకిస్తున్నారో తెలుసుకోవడానికే దీన్ని అమలు చేస్తున్నామన్నారు.పురావస్తు సర్వేక్షణ విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్కుమార్, సర్వేయర్ ప్రశాంత్, చార్మినార్ ఇంఛార్జి డాక్టర్ గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









