ఎంత మంది చార్మినార్ తిలకిస్తున్నారో తెలుసుకోవడానికే ఈ ఈ-టిక్కెట్
- June 02, 2016
చారిత్రక చార్మినార్ కట్టడం సందర్శకులకు బుధవారం నుంచి ఈ-టికెట్లు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ సర్కిల్ పురాతత్వ సర్వేక్షణ విభాగం సూపరింటెండెంట్ ఎన్.తహర్ ఈ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-టికెట్ విధానంలో పారదర్శకత ఉంటుందన్నారు. భారతీయ సందర్శకులకు రూ.15, విదేశీయులకు రూ.200 ప్రవేశ రుసుముగా వసూలు చేస్తున్నామన్నారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని, అయినా వీరికి సైతం ఉచిత ఈ-ప్రవేశ టికెట్ జారీ చేస్తున్నామన్నారు. ఎంత మంది పిల్లలు చార్మినార్ తిలకిస్తున్నారో తెలుసుకోవడానికే దీన్ని అమలు చేస్తున్నామన్నారు.పురావస్తు సర్వేక్షణ విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్కుమార్, సర్వేయర్ ప్రశాంత్, చార్మినార్ ఇంఛార్జి డాక్టర్ గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







