ఎంత మంది చార్మినార్‌ తిలకిస్తున్నారో తెలుసుకోవడానికే ఈ ఈ-టిక్కెట్

- June 02, 2016 , by Maagulf
ఎంత మంది  చార్మినార్‌ తిలకిస్తున్నారో తెలుసుకోవడానికే ఈ ఈ-టిక్కెట్

చారిత్రక చార్మినార్‌ కట్టడం సందర్శకులకు బుధవారం నుంచి ఈ-టికెట్లు జారీ చేస్తున్నారు. హైదరాబాద్‌ సర్కిల్‌ పురాతత్వ సర్వేక్షణ విభాగం సూపరింటెండెంట్‌ ఎన్‌.తహర్‌ ఈ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-టికెట్‌ విధానంలో పారదర్శకత ఉంటుందన్నారు. భారతీయ సందర్శకులకు రూ.15, విదేశీయులకు రూ.200 ప్రవేశ రుసుముగా వసూలు చేస్తున్నామన్నారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని, అయినా వీరికి సైతం ఉచిత ఈ-ప్రవేశ టికెట్‌ జారీ చేస్తున్నామన్నారు. ఎంత మంది పిల్లలు చార్మినార్‌ తిలకిస్తున్నారో తెలుసుకోవడానికే దీన్ని అమలు చేస్తున్నామన్నారు.పురావస్తు సర్వేక్షణ విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్‌ అనిల్‌కుమార్‌, సర్వేయర్‌ ప్రశాంత్‌, చార్మినార్‌ ఇంఛార్జి డాక్టర్‌ గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com