మార్చి 8 నుండి 'ఇండియా బై ది క్రీక్' ఫెస్టివల్.. ప్రవేశం ఉచితం

- March 01, 2024 , by Maagulf
మార్చి 8 నుండి \'ఇండియా బై ది క్రీక్\' ఫెస్టివల్.. ప్రవేశం ఉచితం

దుబాయ్: భారతదేశం మరియు దుబాయ్ ఎమిరేట్ మధ్య లోతైన చారిత్రక సంబంధాలను పురస్కరించుకొని మొట్టమొదటి 'ఇండియా బై ది క్రీక్' ఫెస్టివల్ మార్చి 8-10 వరకు దుబాయ్‌లోని అల్ సీఫ్ పార్క్‌లో నిర్వహించనున్నారు. అందరికీ ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. దుబాయ్ ఎకానమీ మరియు టూరిజం, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, టీమ్‌వర్క్ ఆర్ట్స్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.  ఈ సందర్భంగా దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ.. తనకు 8 నెలల క్రితమే ఇండియా బై ది క్రీక్ అనే భావన వచ్చిందన్నారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ అయినా లేదా ఈజిప్ట్‌లోని ‘ఇండియా బై ది నైల్’ అయినా భారీ విజయాన్ని సాధించాయని గుర్తుచేశారు.  మూడు రోజుల పాటు దుబాయ్ క్రీక్ ఫెస్టివల్ లో భాగంగా ఇండియా, యూఏఈ వచ్చిన కళాకారుల ప్రోగ్రామ్స్ ఉంటాయన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com