అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులకు కేంద్రంగా సౌదీ అరేబియా
- March 01, 2024
రియాద్: సౌదీ అరేబియాలో తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలను ప్రారంభించడానికి ఇప్పటివరకు 450 మంది అంతర్జాతీయ పెట్టుబడిదారులు లైసెన్స్ పొందారని, వీరిలో ఎక్కువ మంది రియాద్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారని మంత్రి ఖలీద్ అల్-ఫాలిహ్ తెలిపారు. రియాద్లో గురువారం జరిగిన హ్యూమన్ కెపాసిటీ ఇనీషియేటివ్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలకు కేంద్రంగా చాలా మంది పెట్టుబడిదారులు సౌదీని ఎంచుకున్నారని, లైసెన్సులు పొందిన 450 మంది అంతర్జాతీయ పెట్టుబడిదారులతో కొద్ది రోజుల క్రితం సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సౌదీ అరేబియాలో అంతర్జాతీయ పెట్టుబడుల కోసం లైసెన్సుల సంఖ్య ప్రారంభంలో 3,000 నుండి 30,000 వ్యాపార లైసెన్సులకు పెరిగిందని అల్-ఫాలిహ్ వెల్లడించారు. అదే సమయంలో భవిష్యత్ నైపుణ్యాలను అలవర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వర్క్ఫోర్స్ తమకు కావాలని పెట్టుబడిదారులు అడుగుతున్నారని మంత్రి వివరించారు. ఈ దశాబ్దంలోనే సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థకు $3 ట్రిలియన్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించదన్నారు. ఈ పెట్టుబడులలో ఎక్కువ భాగం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, పర్యాటకం, ఆర్థిక మరియు వృత్తిపరమైన సేవల వంటి కొత్త ఆర్థిక రంగాలు ఉన్నాయని అల్-ఫాలిహ్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







