అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులకు కేంద్రంగా సౌదీ అరేబియా
- March 01, 2024
రియాద్: సౌదీ అరేబియాలో తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలను ప్రారంభించడానికి ఇప్పటివరకు 450 మంది అంతర్జాతీయ పెట్టుబడిదారులు లైసెన్స్ పొందారని, వీరిలో ఎక్కువ మంది రియాద్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారని మంత్రి ఖలీద్ అల్-ఫాలిహ్ తెలిపారు. రియాద్లో గురువారం జరిగిన హ్యూమన్ కెపాసిటీ ఇనీషియేటివ్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలకు కేంద్రంగా చాలా మంది పెట్టుబడిదారులు సౌదీని ఎంచుకున్నారని, లైసెన్సులు పొందిన 450 మంది అంతర్జాతీయ పెట్టుబడిదారులతో కొద్ది రోజుల క్రితం సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సౌదీ అరేబియాలో అంతర్జాతీయ పెట్టుబడుల కోసం లైసెన్సుల సంఖ్య ప్రారంభంలో 3,000 నుండి 30,000 వ్యాపార లైసెన్సులకు పెరిగిందని అల్-ఫాలిహ్ వెల్లడించారు. అదే సమయంలో భవిష్యత్ నైపుణ్యాలను అలవర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వర్క్ఫోర్స్ తమకు కావాలని పెట్టుబడిదారులు అడుగుతున్నారని మంత్రి వివరించారు. ఈ దశాబ్దంలోనే సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థకు $3 ట్రిలియన్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించదన్నారు. ఈ పెట్టుబడులలో ఎక్కువ భాగం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, పర్యాటకం, ఆర్థిక మరియు వృత్తిపరమైన సేవల వంటి కొత్త ఆర్థిక రంగాలు ఉన్నాయని అల్-ఫాలిహ్ చెప్పారు.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







