అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులకు కేంద్రంగా సౌదీ అరేబియా
- March 01, 2024
రియాద్: సౌదీ అరేబియాలో తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలను ప్రారంభించడానికి ఇప్పటివరకు 450 మంది అంతర్జాతీయ పెట్టుబడిదారులు లైసెన్స్ పొందారని, వీరిలో ఎక్కువ మంది రియాద్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారని మంత్రి ఖలీద్ అల్-ఫాలిహ్ తెలిపారు. రియాద్లో గురువారం జరిగిన హ్యూమన్ కెపాసిటీ ఇనీషియేటివ్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలకు కేంద్రంగా చాలా మంది పెట్టుబడిదారులు సౌదీని ఎంచుకున్నారని, లైసెన్సులు పొందిన 450 మంది అంతర్జాతీయ పెట్టుబడిదారులతో కొద్ది రోజుల క్రితం సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సౌదీ అరేబియాలో అంతర్జాతీయ పెట్టుబడుల కోసం లైసెన్సుల సంఖ్య ప్రారంభంలో 3,000 నుండి 30,000 వ్యాపార లైసెన్సులకు పెరిగిందని అల్-ఫాలిహ్ వెల్లడించారు. అదే సమయంలో భవిష్యత్ నైపుణ్యాలను అలవర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వర్క్ఫోర్స్ తమకు కావాలని పెట్టుబడిదారులు అడుగుతున్నారని మంత్రి వివరించారు. ఈ దశాబ్దంలోనే సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థకు $3 ట్రిలియన్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించదన్నారు. ఈ పెట్టుబడులలో ఎక్కువ భాగం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, పర్యాటకం, ఆర్థిక మరియు వృత్తిపరమైన సేవల వంటి కొత్త ఆర్థిక రంగాలు ఉన్నాయని అల్-ఫాలిహ్ చెప్పారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









