షేక్ జాబర్ అల్-అహ్మద్ వంతెన మూసివేత
- March 07, 2024
కువైట్: కువైట్ స్పోర్ట్స్ డే కార్యక్రమాల సందర్భంగా మార్చి 9వ తేదీ (శనివారం) షేక్ జాబర్ అల్-అహ్మద్ వంతెన రెండు వైపులా తాత్కాలికంగా మూసివేయబడుతుంది. శనివారం తెల్లవారుజామున 2:00 గంటల నుండి సుబియా ప్రాంతం వైపు మరియు 7:00 నుండి కార్యకలాపాలు ముగిసే వరకు అల్-గజాలీ రోడ్ వైపు వంతెన మూసివేయబడుతుందని అధికారులు ప్రకటించారు. జనరల్ స్పోర్ట్స్ అథారిటీ మార్చి 9వ తేదీ శనివారం వంతెన వద్ద కువైట్ స్పోర్ట్స్ డే కార్యకలాపాలను నిర్వహించనుంది. ఈ సమయంలో వాహనదారులు ట్రాఫిక్ అధికారుల సూచనలను పాటించాలని , ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్లో స్వీట్న్డ్ డ్రింక్స్కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







