దుబాయ్ లో ఆస్తి పోరు..ఇళ్లు దక్కుతాయో లేదోనన్న ఆందోళన..!
- March 09, 2024
దుబాయ్: 40 ఏళ్లపాటు అద్దె అపార్ట్మెంట్లో నివసించిన భారత ప్రవాసుడు (యూఏఈలో పుట్టి పెరిగాడు) ఒకరు తన కుటుంబానికి ఆస్తిని కొనుగోలు చేయాలని కలలు కన్నాడు. చాలా పరిశోధన చేసి చివరకు ఫాల్కాన్సిటీ ఆఫ్ వండర్స్ - ఈస్టర్న్ రెసిడెన్స్లో 4-మిలియన్లు పెట్టి ఇల్లును కొనుగోలు చేయాలని అనుకున్నాడు. కానీ ఆస్తిలో 1.6 మిలియన్ దిర్హామ్లు పెట్టుబడి పెట్టిన తర్వాత, అతను ఇప్పుడు తన కలల ఇంటిని పొందుతాడా లేదా తన డబ్బును తిరిగి పొందుతాడా అన్న సందిగ్ధంలో ఉన్నాడు. చాలా మంది ప్రవాసులు ఫాల్కన్ ప్రాపర్టీస్ మరియు దుబాయ్ల్యాండ్ (LLC) మధ్య చట్టపరమైన వివాదం కారణంగా వారి ఇళ్లను నిర్మించిన ప్లాట్లను వేలం వేయడంతో, అదే ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టిన దుబాయ్లోని వందలాది మంది ఇతర వ్యక్తులు ప్రస్తుతం తమ ఇళ్లు మరియు జీవిత పొదుపులను కోల్పోతారనే భయంతో జీవిస్తున్నారు.
ఫాల్కన్సిటీ ఆఫ్ వండర్స్ ప్రాజెక్ట్ 2005లో దుబాయ్ల్యాండ్లో ప్రారంభించారు. ఇది వాణిజ్య, నివాస మరియు వినోద సౌకర్యాలను ఒకేచోట అందించే ప్రాజెక్టుగా వెల్లడించారు. 2021లో ఫాల్కన్సిటీ ఈస్టర్న్ రెసిడెన్స్ ఇళ్ల విక్రయాలు ప్రారంభం అయ్యాయి. అనంతరం అది వివాదంలోకి వెళ్లింది. దుబాయ్ కోర్టుల పత్రాల ప్రకారం.. అక్టోబర్ 2020లో ఫాల్కాన్సిటీ డెవలపర్లు దుబాయ్ల్యాండ్కి ఇవ్వాల్సిన Dh1.3 బిలియన్లు చెల్లించాలని ఆదేశించింది. అలా చేయడంలో విఫలమైతే డెవలపర్ ఆస్తి - ప్రత్యేకంగా, వాడి అల్ సఫా 2 ప్రాంతంలోని ప్రాజెక్ట్ అధికారికంగా జప్తు చేయవచ్చని తెలిపింది. 15 రోజుల్లో అప్పు చెల్లించకుంటే ఆ ఆస్తిని వేలంలో విక్రయిస్తామని దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ (డిఎల్డి) హెచ్చరించింది. జూలై 2023లో రుణాన్ని తిరిగి చెల్లించడంలో వైఫల్యం కారణంగా వారి ఆస్తి విక్రయం కొనసాగుతుందని ఫాల్కాన్సిటీకి ఇమెయిల్ ద్వారా తెలియజేసారు. భూమిని విక్రయించడానికి అనేక ప్రయత్నాల తర్వాత, కోర్టు చివరకు అక్టోబర్ 2023లో దుబాయ్ల్యాండ్ LLC (బిడ్దారు)కి వేలం వేయడానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రెండు పార్టీల మధ్య కోర్టు వివాదం కొనసాగుతున్నప్పటికీ, ఫాల్కన్సిటీ విక్రయాల బృందం 400 కంటే ఎక్కువ విల్లాలను విక్రయించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష