భారత రాయబార కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం

- March 10, 2024 , by Maagulf
భారత రాయబార కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం

మస్కట్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మస్కట్ లోని భారత రాయబార కార్యాలయం 'మాండ్వీ టు మస్కట్' ను నిర్వహించింది. ఇందులో ప్రవాస మహిళల సాధికారత విజయాలను షేర్ చేసుకున్నారు. సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంధ్యా రావు మెహతాతో పాటు

ఒమన్ సుల్తానేట్‌లో భారత రాయబారి అమిత్ నారంగ్ జీవిత భాగస్వామి దివ్య నారంగ్.. మహిళలను గౌరవించే భారతీయ సంప్రదాయాల గురించి తెలుపుతూ కీలకోపన్యాసం చేశారు. 'ఒమన్‌లోని హిస్టారికల్ ఇండియన్ కమ్యూనిటీలో మహిళల సాధికారత కథనాలు' శీర్షికన డాక్టర్ సంధ్య ఉపన్యాసం ఇచ్చారు. 20వ శతాబ్దపు ఆరంభం నుండి నేటి వరకు ఉన్న ఒమన్‌లోని భారతీయ మహిళల చరిత్రను ఆమె వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com