పుకార్లను నమ్మొద్దు.. తుఫాను ముప్పు ఇంకా తొలగిపోలేదు..!

- March 10, 2024 , by Maagulf
పుకార్లను నమ్మొద్దు.. తుఫాను ముప్పు ఇంకా తొలగిపోలేదు..!

యూఏఈ: తుఫాను ముప్పు ముగిసిందన్న వార్తలను జాతీయ వాతావరణ కేంద్రం ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. "ఈ వార్త నిజం కాదు. ప్రస్తుతం దేశం ఉపరితల అల్పపీడనం కారణంగా ప్రభావితమైంది. ప్రస్తుతానికి  అబుదాబి మరియు దుబాయ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి " అని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ అధికారి మహా అల్ హషేమీ తెలిపారు. దేశంలోని తూర్పు మరియు దక్షిణ ప్రాంతాలలో రాత్రి సమయంలో భారీ వర్షాలు పడే  అవకాశం ఉందని పేర్కొన్నారు.జాతీయ వాతావరణ కేంద్రం నుండి తాజా వాతావరణ సలహాలతో జాగ్రత్తగా ఉండాలని, అప్‌డేట్‌గా ఉండాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com