‘విశ్వంభర’ సిస్టర్ సెంటిమెంట్తో రాబోతోందా??
- March 10, 2024
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ‘అంజి’ సినిమా తరువాత మరోసారి గ్రాఫిక్స్ తో సిద్ధం చేస్తున్న సినిమా ‘విశ్వంభర’. బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం.. పక్క ప్రణాళికతో ముందుకు సాగుతుంది. కాగా గ్రాఫికల్ వండర్ గా రూపొందుతున్న ఈ మూవీ.. సిస్టర్ సెంటిమెంట్తో రాబోతుందని టాక్ వినిపిస్తుంది.
సిస్టర్ సెంటిమెంట్ని, సోషియో ఫాంటసీని జత చేతి వశిష్ఠ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. ఈక్రమంలోనే ఈ సినిమాలో చిరుకి చెల్లెళ్లుగా ముగ్గురు నటించబోతున్నారట. ఈ ముగ్గురిలో ఒకరు హీరోయిన్ సురభి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు చెల్లిళ్లతో చిరు కలిసి ఉన్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ చిత్రం నిజంగానే సిస్టర్ సెంటిమెంట్ తోనే తెరకెక్కుతుందా..? ఈ ముగ్గురేనా చెల్లెళ్ళ పాత్రలు చేసేది అనేది తెలియాల్సి ఉంది.
కాగా గతంలో చిరంజీవి ‘హిట్లర్’ సినిమాలో ఇలా ముగ్గురు చెల్లిళ్లతో ఆడియన్స్ ముందుకు వచ్చి సిస్టర్ సెంటిమెంట్ తో సూపర్ హిట్టుని అందుకున్నారు. ఆ సమయంలో ప్లాప్స్ లో ఉన్న చిరుకి అది బిగ్గెస్ట్ కమ్బ్యాక్ అయ్యింది. మరి ఇప్పుడు ఈ సినిమా కూడా సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చి.. భోళాశంకర్ తో ఎదుర్కొన్న విమర్శలు అన్నిటికి చెక్ పెడుతుందేమో చూడాలి.
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొత్తం విశ్వాన్ని చూపించేందుకు.. దాదాపు 13 సెట్స్ ని నిర్మించారట. మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతుందన సినిమా కావడంతో.. మూవీలో 70 శాతం VFX పైనే డిజైన్ అయ్యి ఉంటుందని పేర్కొన్నారు. అంజి సినిమాలో తన సినిమాటోగ్రఫీతో మెస్మరైజ్ చేసిన చోట కె నాయుడు.. ఈ చిత్రానికి కూడా కెమెరా మెన్గా చేస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







