మహిళ వేషధారణలో భిక్షాటన.. వ్యక్తి అరెస్ట్
- March 16, 2024
దుబాయ్: మహిళ వేషధారణలో భిక్షాటన చేస్తున్న అరబ్ యువకుడిని మసీదు సమీపంలో పట్టుకున్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. రమదాన్ సందర్భంగా భిక్షాటనను ఎదుర్కోవడానికి అధికారులు సమగ్ర భద్రతా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. దుబాయ్ పోలీస్లోని సస్పెక్ట్స్ అండ్ క్రిమినల్ ఫినామినా డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అలీ సలేమ్ అల్ షమ్సీ మాట్లాడుతూ.. "వ్యక్తి భిక్షాటన కోసం స్త్రీల దుస్తులను ధరించాడు. ఎందుకంటే పురుషుల కంటే మహిళలు యాచించడం పట్ల ప్రజలు ఎక్కువ సానుభూతి చూపుతారని అతను నమ్మాడు." అని పేర్కొన్నారు. అనుమానాస్పద యువకుడు మహిళ వేషంలో బిక్షాటన చేస్తున్నాడని స్థానికుల నుండి సమాచారం అందిన సమాచారం మేరకు ఆ వ్యక్తిని పట్టుకున్నట్లు అల్ షమ్సీ తెలిపారు. పవిత్ర మాసంలో ప్రజల సానుభూతిని సద్వినియోగం చేసుకునే స్కామర్ల బారిన పడవద్దని దుబాయ్ పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. రమదాన్ మొదటి రోజున 17 మంది యాచకులను అరెస్టు చేసినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. వారిలో 13 మంది పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. దుబాయ్ పోలీసుల ప్రకారం.. నేరస్థులకు కనీసం 5,000 దిర్హామ్ జరిమానా, మూడు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. భిక్షాటన కార్యకలాపాలు నిర్వహించి, విదేశాల నుంచి భిక్షాటనలో నిమగ్నమయ్యే వ్యక్తులను తీసుకొచ్చిన వారికి కనీసం ఆరు నెలల జైలు శిక్ష మరియు 100,000 దిర్హామ్లకు తగ్గకుండా జరిమానా విధించబడుతుంది. లైసెన్స్ లేకుండా నిధుల సేకరణను అభ్యర్థించడానికి లేదా ప్రోత్సహించడానికి సమాచార సాంకేతికతను ఉపయోగించే ఎవరైనా Dh250,000 కంటే తక్కువ Dh500,000 కంటే ఎక్కువ జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్లో 901కి కాల్ చేయడం లేదా 'పోలీస్ ఐ' సేవను ఉపయోగించడం ద్వారా ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు లేదా భిక్షాటన గురించి తెలియజేయాలని కోరారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









