నేడు విశాఖలో సీఎం రేవంత్ పర్యటన
- March 16, 2024
విశాఖపట్నం: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.ఆయన తన పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం 4:15 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి 05:15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి 05:30 గంటలకు స్టీల్ ప్లాంట్ వద్ద ఉన్న తృష్ణ గ్రౌండ్ కి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మరల 07:00 గంటలకు అక్కడి నుండి బయలుదేరి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు అనంతరం 07:15 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి పయనమవుతారు. ఇదిలా ఉండగా తొలిసారి ఏపీ వేదికగా రేవంత్రెడ్డి ఎలాంటి కామెంట్లు చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ – వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సభావేదికగా సేవ్ వైజాగ్ – సేవ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







