నేడు విశాఖలో సీఎం రేవంత్ పర్యటన
- March 16, 2024
విశాఖపట్నం: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.ఆయన తన పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం 4:15 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి 05:15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి 05:30 గంటలకు స్టీల్ ప్లాంట్ వద్ద ఉన్న తృష్ణ గ్రౌండ్ కి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మరల 07:00 గంటలకు అక్కడి నుండి బయలుదేరి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు అనంతరం 07:15 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి పయనమవుతారు. ఇదిలా ఉండగా తొలిసారి ఏపీ వేదికగా రేవంత్రెడ్డి ఎలాంటి కామెంట్లు చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ – వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సభావేదికగా సేవ్ వైజాగ్ – సేవ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









