25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- February 05, 2026
ఐటీ (IT) రంగంలో ఉద్యోగాల కోత, లే ఆఫ్స్, నియామకాల తగ్గుదల వంటి అంశాలతో నిరుద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్న సమయంలో ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తీపి కబురు అందించింది. ఈ ఏడాదిలో సుమారు 24,000 నుంచి 25,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది చేసిన నియామకాలతో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం అధికం కావడం గమనార్హం.
ఈ ప్రకటనతో ఐటీ ఫ్రెషర్లలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.జెమిని, ఓపెన్ ఏఐ వంటి ప్లాట్ఫారమ్లతో జతకట్టి ఏఐ టూల్స్ ద్వారా ఎంట్రీ లెవల్ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచుతున్నామని సీఈఓ రవి కుమార్ వెల్లడించారు. ఏఐ సహాయంతో కొత్త ఇంజనీర్లు గతంలో కంటే వేగంగా క్లయింట్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు అవుతున్నారని, అందుకే ఫ్రెషర్ల నియామకాన్ని పెంచుతున్నామని కంపెనీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









