25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- February 05, 2026
ఐటీ (IT) రంగంలో ఉద్యోగాల కోత, లే ఆఫ్స్, నియామకాల తగ్గుదల వంటి అంశాలతో నిరుద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్న సమయంలో ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తీపి కబురు అందించింది. ఈ ఏడాదిలో సుమారు 24,000 నుంచి 25,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది చేసిన నియామకాలతో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం అధికం కావడం గమనార్హం.
ఈ ప్రకటనతో ఐటీ ఫ్రెషర్లలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.జెమిని, ఓపెన్ ఏఐ వంటి ప్లాట్ఫారమ్లతో జతకట్టి ఏఐ టూల్స్ ద్వారా ఎంట్రీ లెవల్ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచుతున్నామని సీఈఓ రవి కుమార్ వెల్లడించారు. ఏఐ సహాయంతో కొత్త ఇంజనీర్లు గతంలో కంటే వేగంగా క్లయింట్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు అవుతున్నారని, అందుకే ఫ్రెషర్ల నియామకాన్ని పెంచుతున్నామని కంపెనీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







