నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- February 05, 2026
నైజీరియాలోని క్వారా రాష్ట్రంలో ఉన్న వోరో, నూక అనే రెండు గ్రామాలను ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఒక్కసారిగా సాయుధ దుండగులు గ్రామాల్లోకి చొరబడి ప్రజలను చుట్టుముట్టారు. దుండగులు గ్రామస్తుల చేతులను వెనక్కి విరిచి కట్టి, ఆపై కాల్చి చంపారు. ఈ దాడిలో దాదాపుగా 200 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కేవలం హత్యలు చేయడమే కాకుండా గ్రామాల్లోని ఇళ్లను, దుకాణాలకు నిప్పు పెట్టి కాల్చేశారు. ప్రాణభయంతో కొందరు ప్రజలు అడవుల్లోకి పరుగులు తీశారు. వీధుల్లో ఎక్కడ చూసినా కూడా శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్రంగా ఖండించింది.
గత ఐదు నెలలుగా దుండగులు గ్రామస్థులను హెచ్చరిస్తూ లేఖలు పంపుతున్నా, ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల నైజీరియా సైన్యం ఉగ్రవాదులే లక్ష్యంగా జరిపిన ఆపరేషన్లో సుమారు 150 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తమ వారిని చంపినందుకు ప్రతీకారంగానే సాయుధ ముఠాలు ఈ నరమేధానికి పాల్పడి ఉండవచ్చని క్వారా గవర్నర్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. అలాగే కాట్సినా రాష్ట్రంలో కూడా దుండగులు రెచ్చిపోయారు. అక్కడ జరిగిన దాడిలో మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
తాజా వార్తలు
- ఒమన్ తీవ్రమైన వేడి.. 48°Cకు ఉష్ణోగ్రతలు..!!
- క్యజో రి శిఖరాన్ని అధిరోహించిన యువ బహ్రెయిన్ సాహసికుడు..!!
- అల్ జౌర్ బీచ్లో షార్క్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..!!
- అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన..ప్రత్యేకంగా సౌదీ పెవిలియన్..!!
- Q1లో స్థిరంగా ఖతార్ రిటైల్ రియల్ ఎస్టేట్ మార్కెట్..!!
- దుబాయ్లో జూన్ 1నుంచి సాలిక్ వ్యాట్ నిబంధన..!!
- తిరుమలకు రూ.1.13 కోట్ల ఎలక్ట్రిక్ బస్సు విరాళం
- విద్యార్థుల సురక్షిత రవాణాకు సరికొత్త ప్రణాళిక: సైబరాబాద్ సీపీ రమేష్
- భారత్ లో ఇక ప్లాస్టిక్ కరెన్సీ!
- కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు..ఉదయ్ కృష్ణారెడ్డి స్ఫూర్తిదాయక విజయం









