రాశి ఖన్నాను టాలీవుడ్ మర్చిపోయిందా.?
- March 19, 2024అందాల భామ రాశి ఖన్నా.. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించేసింది. బాలీవుడ్లో ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా వుంది. ఆమె నటించిన ‘యోధ’ సినిమా త్వరలో రిలీజ్కి సిద్ధంగా వుంది. దీంతో పాటూ మరో రెండు ప్రాజెక్టులు ఆమె చేతిలో వున్నాయ్.
అలాగే, తమిళంలోనూ రెండు సినిమాల్లో నటిస్తోంది రాశిఖన్నా. కానీ, తెలుగులో మాత్రం ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఓకే చేసింది. అదే ‘తెలుసు కదా’. యూత్ఫుల్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో రాశీఖన్నాకి జోడీగా నటిస్తున్నాడు.
కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరగడం లేదు. ఓ వైపు సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో బిజీగా వున్నాడు. త్వరలో ఈ సినిమా రిలీజ్ వుండడంతో ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా వున్నాడు.
దాంతో ‘తెలుసు కదా’ షూటింగ్ కాస్త డిలే అవుతోందట. అయితే, తెలుగులో రాశీ ఖన్నాని మర్చిపోక ముందే, ఏదో ఒక సినిమా రాశీ ఖన్నా నుంచి రిలీజ్ కావల్సి వుంది. అది క్రేజీ హీరో సిద్దు జొన్నలగడ్డ సినిమా అయితే, కొన్నిరోజులు కాస్త సోదిలో వుంటుంది. అది మాత్రం పక్కా.!
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ