మక్కాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యూనివర్సిటీ స్టూడెంట్స్ మృతి
- March 20, 2024
మక్కా: మక్కాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్ అల్-ఖురా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు స్టూడెంట్స్ మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. పోలీసుల నివేదికల ప్రకారం.. విద్యార్థులను తీసుకెళ్తున్న మినీబస్సు వర్షం కురుస్తున్న సమయంలో అదుపుతప్పి రోడ్డులోని ట్రాఫిక్ ఐలాండ్లోని లైటింగ్ స్తంభాలలో ఒకదానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మినీ బస్సు డ్రైవర్కు కూడా గాయాలయ్యాయి. గాయపడిన స్టూడెంట్స్, డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. మక్కాలోని ఫోర్త్ రింగ్ రోడ్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన స్టూడెంట్స్ అల్-జహీర్ పరిసరాల్లో ఉన్న యూనివర్సిటీ బ్రాంచ్లోని విద్యార్థులుగా గుర్తించారు. భద్రతా అధికారులు మరియు సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ బృందాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. మరణించిన స్టూడెంట్స్ మృతదేహాలను ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు సౌదీ ట్రాఫిక్ డైరెక్టరేట్ తన X ఖాతాలో పేర్కొన్నారు. స్టూడెంట్స్ మరణంపై ఉమ్ అల్-ఖురా యూనివర్శిటీ ప్రెసిడెంట్, ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశఆరు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు