మక్కాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యూనివర్సిటీ స్టూడెంట్స్ మృతి
- March 20, 2024మక్కా: మక్కాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్ అల్-ఖురా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు స్టూడెంట్స్ మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. పోలీసుల నివేదికల ప్రకారం.. విద్యార్థులను తీసుకెళ్తున్న మినీబస్సు వర్షం కురుస్తున్న సమయంలో అదుపుతప్పి రోడ్డులోని ట్రాఫిక్ ఐలాండ్లోని లైటింగ్ స్తంభాలలో ఒకదానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మినీ బస్సు డ్రైవర్కు కూడా గాయాలయ్యాయి. గాయపడిన స్టూడెంట్స్, డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. మక్కాలోని ఫోర్త్ రింగ్ రోడ్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన స్టూడెంట్స్ అల్-జహీర్ పరిసరాల్లో ఉన్న యూనివర్సిటీ బ్రాంచ్లోని విద్యార్థులుగా గుర్తించారు. భద్రతా అధికారులు మరియు సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ బృందాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. మరణించిన స్టూడెంట్స్ మృతదేహాలను ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు సౌదీ ట్రాఫిక్ డైరెక్టరేట్ తన X ఖాతాలో పేర్కొన్నారు. స్టూడెంట్స్ మరణంపై ఉమ్ అల్-ఖురా యూనివర్శిటీ ప్రెసిడెంట్, ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశఆరు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..