మక్కాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యూనివర్సిటీ స్టూడెంట్స్ మృతి
- March 20, 2024
మక్కా: మక్కాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్ అల్-ఖురా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు స్టూడెంట్స్ మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. పోలీసుల నివేదికల ప్రకారం.. విద్యార్థులను తీసుకెళ్తున్న మినీబస్సు వర్షం కురుస్తున్న సమయంలో అదుపుతప్పి రోడ్డులోని ట్రాఫిక్ ఐలాండ్లోని లైటింగ్ స్తంభాలలో ఒకదానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మినీ బస్సు డ్రైవర్కు కూడా గాయాలయ్యాయి. గాయపడిన స్టూడెంట్స్, డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. మక్కాలోని ఫోర్త్ రింగ్ రోడ్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన స్టూడెంట్స్ అల్-జహీర్ పరిసరాల్లో ఉన్న యూనివర్సిటీ బ్రాంచ్లోని విద్యార్థులుగా గుర్తించారు. భద్రతా అధికారులు మరియు సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ బృందాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. మరణించిన స్టూడెంట్స్ మృతదేహాలను ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు సౌదీ ట్రాఫిక్ డైరెక్టరేట్ తన X ఖాతాలో పేర్కొన్నారు. స్టూడెంట్స్ మరణంపై ఉమ్ అల్-ఖురా యూనివర్శిటీ ప్రెసిడెంట్, ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశఆరు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







