కొత్త స్కీముతో పెరగనున్న ఆరోగ్య బీమా ప్రీమియంలు..!
- March 20, 2024
యూఏఈ: మార్చి 18న ప్రకటించిన కొత్త తప్పనిసరి స్కీమ్ను ప్రవేశపెట్టడం ద్వారా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో యూఏఈలో ఆరోగ్య బీమా ప్రీమియంలు పెరిగే అవకాశం ఉంది. ఈ పథకం కింద, యజమానులు తమ ఉద్యోగులకు తప్పనిసరిగా బీమాను అందించాల్సి ఉంటుంది. యూఏఈలోని యజమానులు తప్పనిసరిగా తమ ఉద్యోగుల ఆరోగ్య బీమాను 2025 జనవరి 1 నుండి అందించాలి. యజమానులు వారి రెసిడెన్సీ వీసాలను జారీ చేసేటప్పుడు లేదా పునరుద్ధరించేటప్పుడు వారి ఉద్యోగుల ఆరోగ్య బీమా కవరేజీ కోసం కూడా చెల్లించాల్సి ఉంటుంది. స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత హెల్త్కేర్ సేవలకు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రీమియంలలో స్థిరమైన పెరుగుదల అంచనా వేస్తున్నట్లు http://Insurancemarket.ae సీఈఓ అవినాష్ బాబర్ చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









