చిరంజీవి గెస్టుగా ఆహా సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్..
- March 21, 2024హైదరాబాద్: సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ తొలి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్ళబోతున్నారు. టాలీవుడ్ లోని రెండు బడా సంస్థలుగా గుర్తింపు సంపాదించుకున్న ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ఫెస్టివల్ ని మొదటిసారిగా కండక్ట్ చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ లో సౌత్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ అంతా పాల్గొనబోతున్నారు. ఈ ప్రెస్టీజియస్ కార్యక్రమాన్ని లెెజెండ్రీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ఉత్సవం మార్చి 22న హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో గ్రాండ్ గా జరగబోతుంది. సౌత్ సినీ సెలబ్రిటీస్ పాల్గొనే ఈ ఈవెంట్ కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ లో నటీనటులతో అద్భుతమైన డాన్స్ పర్ఫామెన్స్ లు కూడా ఉండబోతున్నాయి. రీసెంట్ యంగ్ సెన్సేషన్, చిరంజీవికి వీరాభిమాని అయిన తేజ సజ్జా.. మెగాస్టార్ కి ట్రిబ్యూట్ గా అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు.
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ కి సంబంధించిన లేటెస్ట్ ఫొటోని నేడు హీరోయిన్ త్రిష అభిమానులతో పంచుకున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ