మరో చిరంజీవుడి కథకు రంగం సిద్ధమవుతోంది.!
- March 22, 2024పురాణాల్లో చిరంజీవుల గాధలకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ వుంది.హనుమంతుడితో సహా ఏడుగురు చిరంజీవులున్నారని చెబుతుంటారు.
హనుమంతుడి కథతో వచ్చిన ‘హనుమాన్’ ఇటీవల ఏ స్థాయిలో విజయం అందుకుందో తెలిసిందే. ఇప్పుడు మరో చిరంజీవి గాధ పురుడు పోసుకుంటోంది సిల్వర్ స్ర్కీన్పై సంచలనాలు సృష్టించేందుకు.
ఆయన మరెవరో కాదు.. ‘అశ్వధ్దామ’. ‘అశ్వధ్ధామ హతహ కుంజరహ..’ అనే వాక్యం గురించి పురాణాలపై ఏ చిన్నపాటి అవగాహన వున్నా తెలుస్తుంది. ఆ అశ్వధ్ధామ చిరంజీవుడే. ఈయన కథా ఇతివృత్తంతోనే త్వరలో ఓ సినిమా రాబోతోందట.
బాలీవుడ్లో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాని తెలుగు తదితర భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సచిన్ రవి దర్శకత్వం వహిస్తున్నారు.
‘అశ్వద్ధామ ది సాగా కంటిన్యూస్’ అనే టైటిల్తో రూపొందుతోన్న ఈ సినిమాలో అశ్వద్ధామ ఇంకా బతికే వున్నాడన్న పాయింట్ కూడా చూపించబోతున్నారట.
అయితే, ఈ సినిమాని ఈ తరం ప్రేక్షకులకు అర్ధమయ్యే రీతిలో కాదు కాదు, అప్పటి అశ్వద్ధామ నేటి సమాజంలో జీవించి వుంటే.. ఆయన ఎదుర్కొనే పరిస్థితులు ఎలా వుండబోతున్నాయ్ అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో ఈ సినిమా రూపొందబోతోందట. చూడాలి మరి, ఈ నయా ప్రాజెక్ట్కి ఏ రేంజ్ ఆదరణ దక్కేుతుందో.!
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం