మరో చిరంజీవుడి కథకు రంగం సిద్ధమవుతోంది.!
- March 22, 2024
పురాణాల్లో చిరంజీవుల గాధలకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ వుంది.హనుమంతుడితో సహా ఏడుగురు చిరంజీవులున్నారని చెబుతుంటారు.
హనుమంతుడి కథతో వచ్చిన ‘హనుమాన్’ ఇటీవల ఏ స్థాయిలో విజయం అందుకుందో తెలిసిందే. ఇప్పుడు మరో చిరంజీవి గాధ పురుడు పోసుకుంటోంది సిల్వర్ స్ర్కీన్పై సంచలనాలు సృష్టించేందుకు.
ఆయన మరెవరో కాదు.. ‘అశ్వధ్దామ’. ‘అశ్వధ్ధామ హతహ కుంజరహ..’ అనే వాక్యం గురించి పురాణాలపై ఏ చిన్నపాటి అవగాహన వున్నా తెలుస్తుంది. ఆ అశ్వధ్ధామ చిరంజీవుడే. ఈయన కథా ఇతివృత్తంతోనే త్వరలో ఓ సినిమా రాబోతోందట.
బాలీవుడ్లో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాని తెలుగు తదితర భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సచిన్ రవి దర్శకత్వం వహిస్తున్నారు.
‘అశ్వద్ధామ ది సాగా కంటిన్యూస్’ అనే టైటిల్తో రూపొందుతోన్న ఈ సినిమాలో అశ్వద్ధామ ఇంకా బతికే వున్నాడన్న పాయింట్ కూడా చూపించబోతున్నారట.
అయితే, ఈ సినిమాని ఈ తరం ప్రేక్షకులకు అర్ధమయ్యే రీతిలో కాదు కాదు, అప్పటి అశ్వద్ధామ నేటి సమాజంలో జీవించి వుంటే.. ఆయన ఎదుర్కొనే పరిస్థితులు ఎలా వుండబోతున్నాయ్ అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో ఈ సినిమా రూపొందబోతోందట. చూడాలి మరి, ఈ నయా ప్రాజెక్ట్కి ఏ రేంజ్ ఆదరణ దక్కేుతుందో.!
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









