మరో చిరంజీవుడి కథకు రంగం సిద్ధమవుతోంది.!

- March 22, 2024 , by Maagulf
మరో చిరంజీవుడి కథకు రంగం సిద్ధమవుతోంది.!

పురాణాల్లో చిరంజీవుల గాధలకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ వుంది.హనుమంతుడితో సహా ఏడుగురు చిరంజీవులున్నారని చెబుతుంటారు.
హనుమంతుడి కథతో వచ్చిన ‘హనుమాన్’ ఇటీవల ఏ స్థాయిలో విజయం అందుకుందో తెలిసిందే. ఇప్పుడు మరో చిరంజీవి గాధ పురుడు పోసుకుంటోంది సిల్వర్ స్ర్కీన్‌పై సంచలనాలు సృష్టించేందుకు.
ఆయన మరెవరో కాదు.. ‘అశ్వధ్దామ’. ‘అశ్వధ్ధామ హతహ కుంజరహ..’ అనే వాక్యం గురించి పురాణాలపై ఏ చిన్నపాటి అవగాహన వున్నా తెలుస్తుంది. ఆ అశ్వధ్ధామ చిరంజీవుడే. ఈయన కథా ఇతివృత్తంతోనే త్వరలో ఓ సినిమా రాబోతోందట.
బాలీవుడ్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాని తెలుగు తదితర భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సచిన్ రవి దర్శకత్వం వహిస్తున్నారు.
‘అశ్వద్ధామ ది సాగా కంటిన్యూస్’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో అశ్వద్ధామ ఇంకా బతికే వున్నాడన్న పాయింట్ కూడా చూపించబోతున్నారట.
అయితే,  ఈ సినిమాని ఈ తరం ప్రేక్షకులకు అర్ధమయ్యే రీతిలో కాదు కాదు, అప్పటి అశ్వద్ధామ నేటి సమాజంలో జీవించి వుంటే.. ఆయన ఎదుర్కొనే పరిస్థితులు ఎలా వుండబోతున్నాయ్ అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందబోతోందట. చూడాలి మరి, ఈ నయా ప్రాజెక్ట్‌కి ఏ రేంజ్ ఆదరణ దక్కేుతుందో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com