డ్రగ్స్ స్మగ్లర్లు, అక్రమ రవాణాదారుల పై కఠిన చర్యలు.. అంతర్గత మంత్రి
- March 22, 2024
రియాద్: మాదక ద్రవ్యాల స్మగ్లర్లు, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులను ఆదేశించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ మేజర్ జనరల్ ముహమ్మద్ అల్-కర్నీ,హేల్ ప్రాంతంలోని నార్కోటిక్స్ కంట్రోల్కి చెందిన పలువురు సీనియర్ అధికారులతో హెయిల్లోని డైరెక్టరేట్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. డ్రగ్ స్మగ్లర్లు మరియు డీలర్లను అనుసరించడానికి, ట్రాక్ చేయడానికి మరియు అరెస్టు చేయడానికి పూర్తి మద్దతు ఉంటుందని ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. స్మగ్లర్ల నేర కార్యకలాపాల నుండి దేశాన్ని రక్షించడానికి అధికారులు మరింత సమర్థవంతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రాంతీయ తనిఖీ పర్యటనకు వచ్చిన ఆయనకు హేల్ ప్రాంతానికి చెందిన ఎమిర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సాద్ మరియు డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫహద్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలను మంత్రికి వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







