సామూహిక ఇఫ్తార్.. 71 ప్రదేశాలలో 35వేల మందికి ఆహారం
- March 22, 2024
యూఏఈ: సాయంత్రం 5:30 కాగానే అబూ హైల్, హోర్ అల్ అంజ్, బరాహా వంటి ఇతర పొరుగు ప్రాంతాలలోని వేలాది మంది నివాసితులు బీట్ అల్ ఖీర్ సొసైటీ ఆధ్వర్యంలోని సామూహిక ఇఫ్తార్ టెంట్కి చేరుకుంటారు. ఈ సొసైటీ యూఏఈలోని 71 ప్రాంతాలలో సేవలను అందిస్తుంది. రమదాన్ సందర్భంగా ప్రతిరోజూ 35,300 భోజనాలను పంపిణీ చేస్తుంది. దేశవ్యాప్తంగా 55 వంటశాలలలో భోజనం తయారు చేస్తారు. 94 మంది వాలంటీర్ల బృందం ఈ ఉదాత్తమైన సేవలను విజయవంతంగా అమలు చేస్తుంది. పాత దుబాయ్లోని హోర్ అల్ ఐంజ్ పరిసరాల్లోనే వాలంటీర్లు 3,500 మందికి పైగా వ్యక్తులను ఇఫ్తార్ విందును అందజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి లాబన్, బియ్యం, హరీసా, నీరు, పండ్లు, ఖర్జూరాలు మరియు స్వీట్లతో కూడిన ఇఫ్తార్ బాక్స్ను అందజేస్తారు. ఉపవాసం ఉన్నప్పటికీ వాలంటీర్లు రోజంతా అవిశ్రాంతంగా పని చేస్తారు. ఇఫ్తార్ కోసం ఆహారాన్ని సిద్ధం చేయడానికి, ప్యాక్ చేయడానికి ఉదయం నుంచే పనిని ప్రారంభిస్తారు. సాయంత్రం 4:00 గంటలకు వాలంటీర్లు టెంట్ను శుభ్రం చేసి సిద్ధం చేస్తారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







