‘సుల్తాన్ ఖబూస్ బహుమతి’ని పునరుద్ధరించిన యునెస్కో
- March 22, 2024
మస్కట్: ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో) పర్యావరణ పరిరక్షణ కోసం యునెస్కో సుల్తాన్ ఖబూస్ బహుమతిని వచ్చే ఆరేళ్లకు పునరుద్ధరించింది. ప్రస్తుతం పారిస్లో జరుగుతున్న యునెస్కో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 219వ సెషన్లో ఒమన్ (యునెస్కోకు శాశ్వత ప్రతినిధి బృందం ద్వారా) పాల్గొన్న సందర్భంగా దీనిని ప్రకటించారు. ఈ సమావేశాలు మార్చి 27వరకు కొనసాగనుంది. ఈ అవార్డు సంస్థ యొక్క విజ్ఞాన రంగం కార్యక్రమాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉంటుందని ప్రకటించింది. అలాగే "మ్యాన్ అండ్ ది బయోస్పియర్"పై యునెస్కో ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ రంగంలో అత్యుత్తమ విజయాలు సాధించిన లేదా విశేషమైన కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులు మరియు పార్టీలను ఈ అవార్డును అందజేయనున్నారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









