సరదాగా కిక్బాక్సింగ్.. కోమాలోకి వెళ్లిన యువకుడు
- March 22, 2024
దుబాయ్: ఇద్దరు తోటి విద్యార్థుల మధ్య జరిగిన స్నేహపూర్వక మ్యాచ్ కారణంగా ఒక టీనేజ్ బాలుడు కోమాలోకి వెళ్లాడు. గత ఏడాది నవంబర్ 4న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో JBR ప్రాంతంలో ఇసుకతో కూడిన పిచ్పై జరిగిన ఈ సంఘటన తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. అమెరికాకు చెందిన 17 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల బ్రిటిష్ స్కూల్మేట్ తో కిక్బాక్సింగ్ మ్యాచ్ ఆడాడు. ఇద్దరూ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. ఈ సందర్భంగా తగిలిన దెబ్బతో అమెరికాకు చెందిన యువకుడు అపస్మారక స్థితికి చేరాడు. అనంతరం రషీద్ ఆసుపత్రికి తరలించారు. మెదడు వెలుపల రక్తస్రావం కలిగడంతో ఆపరేషన్ చేసారు. బాధితుడు చాలా రోజులు కోమాలో ఉండి చివరకు డిసెంబర్ 15న డిశ్చార్జ్ చేశారు. కిక్బాక్సింగ్ మ్యాచ్ను పాఠశాల విద్యార్థుల మధ్య స్నేహపూర్వక క్రీడగా పేర్కొంటూ.. కేసు దుబాయ్ జువెనైల్స్ మిస్డిమినర్ కోర్టుకు వెళ్లింది. “అతను (బాధితుడు) నా స్నేహితుడు. మేము ఆడుకుంటున్నాము. అతడిని బాధపెట్టాలని నా ఉద్దేశ్యం కాదు’’ అని నిందితుడు కోర్టు రికార్డుల్లో పేర్కొన్నాడు. మార్చి 27న తుది తీర్పు వెలువడనుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







