సరదాగా కిక్బాక్సింగ్.. కోమాలోకి వెళ్లిన యువకుడు
- March 22, 2024
దుబాయ్: ఇద్దరు తోటి విద్యార్థుల మధ్య జరిగిన స్నేహపూర్వక మ్యాచ్ కారణంగా ఒక టీనేజ్ బాలుడు కోమాలోకి వెళ్లాడు. గత ఏడాది నవంబర్ 4న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో JBR ప్రాంతంలో ఇసుకతో కూడిన పిచ్పై జరిగిన ఈ సంఘటన తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. అమెరికాకు చెందిన 17 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల బ్రిటిష్ స్కూల్మేట్ తో కిక్బాక్సింగ్ మ్యాచ్ ఆడాడు. ఇద్దరూ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. ఈ సందర్భంగా తగిలిన దెబ్బతో అమెరికాకు చెందిన యువకుడు అపస్మారక స్థితికి చేరాడు. అనంతరం రషీద్ ఆసుపత్రికి తరలించారు. మెదడు వెలుపల రక్తస్రావం కలిగడంతో ఆపరేషన్ చేసారు. బాధితుడు చాలా రోజులు కోమాలో ఉండి చివరకు డిసెంబర్ 15న డిశ్చార్జ్ చేశారు. కిక్బాక్సింగ్ మ్యాచ్ను పాఠశాల విద్యార్థుల మధ్య స్నేహపూర్వక క్రీడగా పేర్కొంటూ.. కేసు దుబాయ్ జువెనైల్స్ మిస్డిమినర్ కోర్టుకు వెళ్లింది. “అతను (బాధితుడు) నా స్నేహితుడు. మేము ఆడుకుంటున్నాము. అతడిని బాధపెట్టాలని నా ఉద్దేశ్యం కాదు’’ అని నిందితుడు కోర్టు రికార్డుల్లో పేర్కొన్నాడు. మార్చి 27న తుది తీర్పు వెలువడనుంది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









