సరదాగా కిక్బాక్సింగ్.. కోమాలోకి వెళ్లిన యువకుడు
- March 22, 2024
దుబాయ్: ఇద్దరు తోటి విద్యార్థుల మధ్య జరిగిన స్నేహపూర్వక మ్యాచ్ కారణంగా ఒక టీనేజ్ బాలుడు కోమాలోకి వెళ్లాడు. గత ఏడాది నవంబర్ 4న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో JBR ప్రాంతంలో ఇసుకతో కూడిన పిచ్పై జరిగిన ఈ సంఘటన తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. అమెరికాకు చెందిన 17 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల బ్రిటిష్ స్కూల్మేట్ తో కిక్బాక్సింగ్ మ్యాచ్ ఆడాడు. ఇద్దరూ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. ఈ సందర్భంగా తగిలిన దెబ్బతో అమెరికాకు చెందిన యువకుడు అపస్మారక స్థితికి చేరాడు. అనంతరం రషీద్ ఆసుపత్రికి తరలించారు. మెదడు వెలుపల రక్తస్రావం కలిగడంతో ఆపరేషన్ చేసారు. బాధితుడు చాలా రోజులు కోమాలో ఉండి చివరకు డిసెంబర్ 15న డిశ్చార్జ్ చేశారు. కిక్బాక్సింగ్ మ్యాచ్ను పాఠశాల విద్యార్థుల మధ్య స్నేహపూర్వక క్రీడగా పేర్కొంటూ.. కేసు దుబాయ్ జువెనైల్స్ మిస్డిమినర్ కోర్టుకు వెళ్లింది. “అతను (బాధితుడు) నా స్నేహితుడు. మేము ఆడుకుంటున్నాము. అతడిని బాధపెట్టాలని నా ఉద్దేశ్యం కాదు’’ అని నిందితుడు కోర్టు రికార్డుల్లో పేర్కొన్నాడు. మార్చి 27న తుది తీర్పు వెలువడనుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు