అమెరికా మార్కెట్లోకి అమూల్ పాలు
- March 26, 2024భారతదేశంలో అతిపెద్ద పాల ఉత్పత్తుల బ్రాండ్ అమూల్.. అతి త్వరలో అమెరికా మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. వారం రోజుల్లో కంపెనీకి చెందిన తాజా పాల ఉత్పత్తులను అమెరికాలో విడుదల చేయనున్నట్లు అమూల్ బ్రాండ్ నిర్వహణదారైన గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎ్ఫ) తెలిపింది. దీని కోసం 108ఏళ్ల చరిత్ర కలిగిన మిషిగన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్తో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పాల సేకరణ, ప్రాసెసింగ్ విధానాన్ని ఆ అసోసియేషన్ చూసుకుంటుందని వెల్లడించారు. త్వరలో పన్నీరు, పెరుగు, మజ్జిగను కూడా ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.
దశాబ్దాలుగా డైరీ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నప్పటికీ తాజా పాలను విదేశాల్లో లాంచ్ చేయడం మాత్రం ఇదే తొలిసారని జీసీఎంఎంఎఫ్ ఎండీ జయేన్ మెహతా అన్నారు. యూఎ్సలోని భారతీయులు, మిగతా ఆసియా దేశాల వారి కోసం వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన చెప్పారు. అమూల్ తాజా, గోల్డ్, శక్తి, స్లిమ్ అండ్ ట్రిమ్ పాలప్యాకెట్లను న్యూయార్క్, న్యూజెర్సీ, షికాగో, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్ తదితర నగరాల్లో విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో జీసీఎంఎంఎఫ్ టర్నోవర్ వార్షిక ప్రాతిపదికన 18.5 శాతం వృద్ధితో రూ.55,000 కోట్లకు చేరుకుంది. ఈ సంస్థ ఇప్పటికే 50 దేశాలకు డైరీ ఉత్పత్తులను ఎగమతి చేస్తోంది.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!