వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- March 27, 2024
యూఏఈ: పెద్దలు మరియు పిల్లలు ఇద్దరినీ ప్రభావితం చేసే చికెన్పాక్స్ కేసుల పెరుగుదలను ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున చికెన్పాక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని యూఏఈలోని వైద్యులు నివాసితులను కోరుతున్నారు. ఇన్ఫెక్షియస్ వరిసెల్లా-జోస్టర్ వైరస్ వల్ల వచ్చే చికెన్ పాక్స్ జ్వరం, గొంతు నొప్పి మరియు విలక్షణమైన దద్దుర్లు వంటి లక్షణాలతో వ్యక్తమవుతుందని వైద్యులు వివరించారు. తుంబే యూనివర్శిటీ హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఫిజీషియన్ డాక్టర్ ఫియాజ్ అహమ్మద్ మాట్లాడుతూ..వేసవి కాలం సమీపిస్తున్న కొద్దీ, సీజన్తో ముడిపడి ఉన్న వివిధ కారణాల వల్ల చికెన్పాక్స్ కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఎక్కువ సమయం ఆరుబయట లేదా ప్రయాణంలో గడుపుతారని, దీంతో వరిసెల్లా-జోస్టర్ వైరస్ వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాప్తి చెందడానికి మరిన్ని అవకాశాలను ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పార్కులు, కొలనులు మరియు పిల్లల శిబిరాలు వంటి రద్దీగా ఉండే ప్రదేశాలలో పిల్లల ఆడుకునే సమయంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చేందే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. వరిసెల్లా-జోస్టర్ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకాక 10-21 రోజులలో దద్దుర్లు కనిపిస్తాయని స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్ ప్రైమ్ మెడికల్ సెంటర్ మోటార్ సిటీ బ్రాంచ్ డాక్టర్ పవిత్ర వి.రెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







